News February 17, 2026
పోరాట ఫలితం.. ఏడేళ్ల క్రితం నెరవేరిన ములుగు జిల్లా స్వప్నం!

సరిగ్గా ఏడేళ్ల క్రితం ఇదే రోజున ములుగు జిల్లాగా ఆవిర్భవించింది. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాట స్ఫూర్తితో సబ్బండవర్గాలు రణ నినాదం చేశాయి. జర్నలిస్టుల పాదయాత్రతో ఉద్యమం తారస్థాయికి చేరింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తన పుట్టినరోజు కానుకగా ములుగు జిల్లాను ప్రకటించారు. 2019 ఫిబ్రవరి 17న ములుగు జిల్లా మనుగడలోనికి వచ్చింది. రామప్పకు యునెస్కో గుర్తింపు, మేడారం జాతరతో ములుగు పేరు విశ్వవ్యాప్తమయ్యింది.
Similar News
News February 21, 2026
NRPT: రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీల్లో బంగారు పతకం

హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీల్లో నారాయణపేటకు చెందిన విద్యాశ్రీ రోయింగ్ విభాగంలో బంగారు పతకం సాధించిందని జిల్లా క్రీడల శాఖ అధికారి వెంకటేశ్ తెలిపారు. అండర్ 16 షాట్ పుట్ పోటీల్లో నర్మదా కాంస్య పతకం గెలుపొందిందన్నారు. ఇద్దరు క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో పథకాలు సాధించడం గర్వకారణమని, మునుముందు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్నారు.
News February 21, 2026
SVU: AP PGCET-26కు దరఖాస్తుల ఆహ్వానం

రాష్ట్ర ఉన్నత విద్యామండలి, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో AP PGCET-2026కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కన్వీనర్ పద్మావతి పేర్కొన్నారు. 17 విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. మరిన్ని వివరాలకు https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 09.
News February 21, 2026
NGKL: యాప్ ద్వారా 2.18 లక్షల బస్తాల యూరియా పంపిణీ

జిల్లాలో యూరియా యాప్ ద్వారా 46,529 మంది రైతులకు 2.18 లక్షల యూరియా బస్తాల పంపిణీ చేశామని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ శనివారం పేర్కొన్నారు. స్మార్ట్ ఫోన్లు లేని రైతులు మండల వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా యూరియాను బుక్ చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం జిల్లాలో 24 యూరియా బస్తాల నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సీజన్లో 7.53 లక్షల యూరియా బస్తాలను రైతులకు పంపిణీ చేశామని తెలిపారు.


