News June 27, 2024
పోలవరంలో చిరుత సంచారం

పోలవరంలో మండలం వింజరం పంచాయతీలో చిరుతపులి మేకను చంపినట్లు అధికారులు గుర్తించారు. కోటేశ్వరరావు మేకలు మేపుకునే వాడు.అయితే అందులో ఒకటి కనిపించడం లేదని అడవిలో గాలిస్తుండగా బుధవారం కళేబరం కనిపించింది.సమాచారం అందుకున్న అధికారులు పోలవరం పరిసరాల్లో చిరుత సంచరిస్తోందని ఎవరూ అడవిలోకి వెళ్లొద్దని , జీవాలను బయటకు వదలొద్దని ఇన్ఛార్జ్ రేంజర్ ఎం.దావీద్ రాజ్ తెలిపారు.
Similar News
News December 31, 2025
సంక్రాంతి సందడి.. పశ్చిమలో హోటళ్లు హౌస్ఫుల్!

తెలుగు లోగిళ్లలో సంక్రాంతి పండుగకు ప.గో జిల్లాకు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి జనం భారీగా తరలి వస్తుంటారు. పండుగ నాలుగు రోజులు జిల్లాలో ప్రధాన పట్టణాల్లో ఉండటానికి హోటళ్లు, లాడ్జిలు ముందుగానే బుక్ చేసుకున్నారు. దాదాపు ఆరు నెలల ముందుగానే బుక్ చేసుకోవడంతో పండుగ సమయంలో హోటల్ రూమ్లు దొరకడంలేదు. నాలుగు రోజుల్లో రూ.కోటికి పైగా వ్యాపారం జరుగుతుందని అంచనా వేస్తున్నారు.
News December 31, 2025
జిల్లా వ్యాప్తంగా బుధవారం పెన్షన్ పంపిణీ: కలెక్టర్

ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను ప్రభుత్వ ఆదేశాలతో ఒక్కరోజు ముందుగానే బుధవారం పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ చదవాల నాగరాణి తెలిపారు. జిల్లావ్యాప్తంగా 2,24,521 మంది లబ్ధిదారులకు రూ.97.19 కోట్లను సచివాలయ సిబ్బంది నేరుగా అందజేస్తారని పేర్కొన్నారు. జనవరి 1న సెలవు కావడంతో లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని, ఉదయం నుంచే పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆమె వివరించారు.
News December 31, 2025
జిల్లా వ్యాప్తంగా బుధవారం పెన్షన్ పంపిణీ: కలెక్టర్

ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను ప్రభుత్వ ఆదేశాలతో ఒక్కరోజు ముందుగానే బుధవారం పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ చదవాల నాగరాణి తెలిపారు. జిల్లావ్యాప్తంగా 2,24,521 మంది లబ్ధిదారులకు రూ.97.19 కోట్లను సచివాలయ సిబ్బంది నేరుగా అందజేస్తారని పేర్కొన్నారు. జనవరి 1న సెలవు కావడంతో లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని, ఉదయం నుంచే పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆమె వివరించారు.


