News December 31, 2025
పోలవరం ఇంఛార్జ్లుగా అల్లూరి జిల్లా అధికారులు

అల్లూరి జిల్లా అధికారులను నూతనంగా ఏర్పడిన పోలవరం జిల్లాకు ఇంఛార్జ్లుగా నియమించారు. ఈ మేరకు ఏపీ సీఎస్ విజయానంద మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రంపచోడవరం కేంద్రంగా ఏర్పడిన పోలవరం జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్గా ఏఎస్ దినేష్ కుమార్, ఇంఛార్జ్ ఎస్పీగా అమిత్ బర్ధర్, ఇంఛార్జ్ జేసీగా పాడేరు ఐటీడీఏ పీఓ తిరుమణి శ్రీపూజను నియమించారు.
Similar News
News January 8, 2026
భిక్కనూరు: ఫార్మా ‘సీక్రెట్స్’ బట్టబయలు

భిక్కనూరులో ఫ్యూజన్ ఫార్మాకు ఇప్పటికే 2 ఎకరాల పర్మిషన్ ఉందని, ప్రస్తుత సేకరణ ‘విస్తరణ’ కోసమేనని తెలిసి జనం షాక్ అయ్యారు. ఆకుపచ్చ పరదాల చాటున అప్పుడే పనులు మొదలయ్యాయి. ఇదొక్కటే కాదు, మరికొన్ని కంపెనీలు కూడా సేకరణ జరగకుండానే పర్మిషన్లు పొందాయని పలువురు ఆరోస్తున్నారు. నాయకులు మాత్రం ‘పొలిటికల్ మైలేజ్’ చూస్తున్నారు తప్పా.. పనులు మొదలయ్యాక వీటిని ఆపడం సాధ్యమేనా? అని జనం ఆందోళన చెందుతున్నారు.
News January 8, 2026
జనవరి 8: చరిత్రలో ఈరోజు

* 1642: ప్రముఖ భౌగోళిక శాస్త్రజ్ఞుడు గెలీలియో మరణం. * 1942: భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ జననం * 1962: లియోనార్డో డావిన్సీ వేసిన ‘మోనాలిసా’ పెయింటింగ్ను USలో తొలిసారి ప్రదర్శించారు. * 1975: మ్యూజిక్ డైరెక్టర్ హ్యారిస్ జైరాజ్ పుట్టినరోజు * 1983: హీరో తరుణ్ బర్త్డే (ఫొటోలో) * 1987: IND మాజీ క్రికెటర్ నానా జోషి మరణం
News January 8, 2026
కేరళలో ఫేక్ డిగ్రీ రాకెట్.. ఆస్ట్రేలియాలో దుమారం!

కేరళలో బయటపడిన ఫేక్ డిగ్రీ రాకెట్ ఆస్ట్రేలియాలో దుమారం రేపుతోంది. నకిలీ సర్టిఫికెట్లతో వస్తున్న విదేశీ విద్యార్థులను ప్రభుత్వం అడ్డుకోవడం లేదని ఆసీస్ సెనేటర్లు మండిపడుతున్నారు. వాటితోనే ఇక్కడ చదువుకుని, ఉద్యోగాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కాగా ఫేక్ డిగ్రీలు అమ్ముతున్న 11 మందిని ఇటీవల కేరళ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు 10 లక్షల మందికి నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చి ఉంటారని భావిస్తున్నారు.


