News January 25, 2026
పోలవరం నిర్వాసితులకు పరిహారం ఎప్పుడంటే?

AP: పోలవరం ప్రాజెక్ట్ ఫస్ట్ ఫేజ్ నిర్వాసితులకు జూన్లోగా పరిహారం ఇవ్వాలని జలవనరుల శాఖ నిర్ణయించింది. మొత్తం 21,709 కుటుంబాలకు పరిహారం అందజేసేందుకు రూ.2,497.98 కోట్లు అవసరం అని అంచనా వేసింది. 2027 మార్చి నాటికి ప్రాజెక్టు తొలిదశ పనులను, ఈ ఏడాది డిసెంబర్లోగా పునరావాస కాలనీల నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు 28 కాలనీలు పూర్తవగా మరో 49 కాలనీల పనులు పూర్తి కావాల్సి ఉంది.
Similar News
News February 20, 2026
నేను సంపాదిస్తాను.. నువ్వు క్రికెట్ ఆడు: వరుణ్ చక్రవర్తి లవ్ స్టోరీ

టీమ్ఇండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి సక్సెస్ వెనక భార్య నేహా ఖేడేకర్ త్యాగం మరువలేనిది. వీరిద్దరి లవ్స్టోరీ SRM వర్సిటీలో మొదలైంది. ఆర్కిటెక్ట్ జాబ్ వదిలేసి క్రికెట్ వైపు వెళ్లాలని వరుణ్ అనుకున్నప్పుడు నేహ కొండంత అండగా నిలిచారు. ‘నీకు జాబ్ లేకపోయినా ఫర్వాలేదు. నేను సంపాదిస్తాను. నువ్వు క్రికెట్ ఆడు’ అని ధైర్యమిచ్చారు. భవిష్యత్తుపై భరోసా లేక తనను వివాహం చేసుకోవద్దని వరుణ్ చెప్పినా ఆమె వినలేదట.
News February 20, 2026
ఏలియన్స్ ఉన్నాయా? సీక్రెట్స్ బయటపెట్టాలని ట్రంప్ ఆదేశం

ఏలియన్స్ ఉన్నాయంటూ <<19147596>>ఒబామా<<>> చేసిన వ్యాఖ్యలను ట్రంప్ మరింత ఆసక్తికరంగా మార్చారు. గ్రహాంతరవాసులు, UFO, UAPలకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే బహిర్గతం చేయాలని ప్రభుత్వ ఏజెన్సీలను ఆదేశించారు. చాలా క్లిష్టమైన, ముఖ్యమైన ఈ సమాచారంపై ప్రజల్లో ఎంతో ఆసక్తి ఉందని అని ఆయన అభిప్రాయపడ్డారు. ఏలియన్స్ ఉన్నాయో.. లేదో.. తనకు మాత్రం తెలియదన్నారు.
News February 20, 2026
పుచ్చ పంటను సాగు చేస్తున్నారా?

వేసవిలో డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని చాలా మంది రైతులు పుచ్చను సాగు చేస్తున్నారు. నవంబర్ నుంచి జనవరి వరకు ఈ పంటను విత్తుకోవచ్చు. ప్రస్తుతం పంట వివిధ దశల్లో ఉంది. రాత్రి చలి వల్ల బూజు, బూడిద తెగులు.. అలాగే పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలకు పంటలో తామరపురుగు వంటి రసం పీల్చే పురుగులు, పండు ఈగ ఆశించి నష్టం కలిగించే అవకాశం ఎక్కువ. ఈ సమయంలో మేలైన యాజమాన్యం పాటిస్తే మంచి దిగుబడి సాధించవచ్చంటున్నారు నిపుణులు.


