News July 2, 2024

పోలవరం ప్రాజెక్ట్ పరిశీలనలో నిపుణుల బృందం

image

పోలవరంలో అంతర్జాతీయ నిపుణుల బృందం మూడవ రోజు పర్యటించింది. ఈ సందర్భంగా ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకొని ముందుగా ECRF (Gap-2)లో సేకరించిన మట్టి, రాతి నమూనాలను పరిశీలించారు. మ్యాప్ పాయింటింగ్ ద్వారా సంబంధిత ఇరిగేషన్ అధికారులు సేకరించిన నమూనాల నాణ్యతను బృందానికి అధికారులు వివరించారు.

Similar News

News September 20, 2024

అండర్‌–19 విభాగంలో క్రీడాకారుల జట్లు ఎంపికలు

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ అండర్‌–19 విభాగంలో క్రీడాకారుల జట్లు ఎంపికలను గురువారం తణుకు మహిళా కళాశాలలో నిర్వహించారు. టేబుల్‌ టెన్నిస్, బ్యాడ్మింటన్, వాలీబాల్, ఖోఖో, యోగా, త్రోబాల్, చదరంగం, టెన్నికాయిట్‌ విభాగాల్లో 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఎంపికైన క్రీడాకారులను జూనియర్‌ మహిళా కళాశాల ప్రిన్సిపల్‌ భూపతిరాజు హిమబిందు అభినందించారు.

News September 20, 2024

త్వరలో నరసాపురానికి వందే భారత్ రైలు: మంత్రి

image

కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ విజయవాడ రైల్వే డివిజన్ అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న రైల్వే పనులు, భద్రతా పనులపై చర్చించామన్నారు. అలాగే నరసాపురం రైల్వే స్టేషన్‌కు వందే భారత్ రైలును ఏర్పాటు చేసే విధంగా కార్యచరణ చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలో మెయిల్, ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

News September 19, 2024

ప.గో: అమెరికాలో గుండెపోటుతో విద్యార్థి మృతి

image

నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెంకి చెందిన తెలుగు విద్యార్థి ముత్తిన రమేశ్ గురువారం అమెరికాలో గుండెపోటుతో మృతి చెందారు. అమెరికాలో ఎంఎస్‌ చదివేందుకు రమేశ్ వెళ్లారు. అతని మరణ వార్త తెలిసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. గడిచిన నాలుగు నెలల కాలంలో ఇదే నియోజకవర్గానికి చెందిన ముగ్గురు ఎంఎస్‌ విద్యార్థులు మృతి చెందారు.