News March 27, 2025

పోలవరం: ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన వివరాలు

image

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించేందుకు రానున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుండి హెలికాప్టర్‌లో బయలుదేరి 10.45 ని.లకు పోలవరం ప్రాజెక్ట్‌కు చేరుకుంటారు. ప్రాజెక్ట్ వ్యూ పాయింట్ నుంచి నిర్మాణ పనులను పరిశీలిస్తారు. 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అధికారులతో సమీక్షిస్తారు. అనంతరం అమరావతి బయలుదేరి వెళ్తారు.

Similar News

News July 4, 2025

డీహైడ్రేషన్‌‌తోనే విద్యార్థులకు అస్వస్థత: FactCheck

image

సోమందేపల్లి మం. పాపిరెడ్డిపల్లి కస్తూర్బా హాస్టల్‌లో కలుషిత ఆహారంతో 15 మంది అస్వస్థతకు గురైనట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అబద్ధమని ప్రభుత్వం పేర్కొంది. ‘విద్యార్థులలో రక్తహీనత నివారణకు ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్, నులిపురుగుల నిర్మూలనకు ఆల్బెండజోల్ మాత్రలు ఇవ్వడం ప్రభుత్వ కార్యక్రమం. ఇవి 232 మందికి ఇవ్వగా 15మంది డీహైడ్రేషన్‌కు గురయ్యారు. అస్వస్థతకు కలుషిత ఆహారం కారణం కాదు’ అని ట్వీట్ చేసింది.

News July 4, 2025

జగిత్యాల: ‘జ్వరాలు రాకుండా చర్యలు తీసుకోవాలి’

image

జగిత్యాల కలెక్టరేట్లో గురువారం వైద్య ఆరోగ్య శాఖ యొక్క నెలవారి సమీక్ష సమావేశాన్ని కలెక్టర్ సత్య ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కువ డెలివరీస్ జరిగేలా చూడాలన్నారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకి అవగాహన కల్పిస్తూ ఉండాలని తెలిపారు. ప్రతి రోజు ఆరోగ్య కార్యకర్తలు ఫీవర్ సర్వే నిర్వహిస్తూ మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాలు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

News July 4, 2025

నల్గొండ: ‘బీఏఎస్ విద్యార్థులపై వివక్ష తగదు’

image

బెస్ట్ అవైలబుల్ స్కీం విద్యార్థులపై ఆల్ఫా స్కూల్ యాజమాన్యం వివక్షతకు పాల్పడుతోందని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున ఆరోపించారు. శుక్రవారం పేరెంట్స్‌తో కలిసి నల్గొండ ఆల్ఫా పబ్లిక్ స్కూల్ ముందు ధర్నా నిర్వహించారు. ప్రైవేట్ స్కూల్‌లో దళిత విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలనే ప్రభుత్వ లక్ష్యం నీరుగారిందని, బుక్స్ ఇవ్వకుండా విద్యార్థులను ఒంటరిగా కూర్చోబెడుతున్నారన్నారు.