News February 16, 2025
పోలవరం: మెడికల్ సబ్ యూనిట్ అధికారి మృతి

పోలవరానికి చెందిన ఏపీ ఎన్జీవోస్ అధ్యక్షుడు బొంగు నాగేశ్వరరావు శనివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్ నాగేశ్వరరావు మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. నాగేశ్వరరావు మృతి సంఘానికి తీరని లోటు అని కొనియాడారు. నాగేశ్వరరావు పోలవరం మెడికల్ సబ్ యూనిట్ ఆఫీసర్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Similar News
News November 8, 2025
పుజారా కెరీర్ను కాపాడిన షారుఖ్.. ఎలాగంటే?

హీరో షారుఖ్ ఖాన్పై IND మాజీ ప్లేయర్ పుజారా భార్య పూజ ప్రశంసలు కురిపించారు. ఆమె రాసిన పుస్తకంలో షారుఖ్ తమ కుటుంబానికి చేసిన సాయాన్ని వివరించారు. ‘2008లో పుజారా మోకాలికి గాయమైంది. అప్పుడు SAలో చికిత్స చేయించేందుకు KKR యాజమాన్యం ముందుకొచ్చింది. అతనికి సాయంగా వెళ్లేందుకు పుజారా తండ్రికి పాస్పోర్ట్, ప్రయాణానికి షారుఖ్ సాయం చేశారు. KKR తరఫున పుజారా ఆడకపోయినా సాయం చేయడం గొప్ప విషయం’ అని గుర్తు చేశారు.
News November 8, 2025
APPLY NOW: MPMMCCలో ఉద్యోగాలు

వారణాసిలోని మహాత్మ పండిట్ మదన్ మోహన్ మాలవ్య క్యాన్సర్ సెంటర్ <
News November 8, 2025
పెందుర్తి: దొంగా-పోలీసు ఆడుదాం అంటూ చంపేసింది

పెందుర్తిలో సొంత అత్తనే కోడలు హత్య చేసిన విషయం <<18232660>>తెలిసిందే<<>>. భర్త పని నిమిత్తం బయటకు వెళ్లిన తర్వాత తన కుమార్తె, అత్త కనకమహాలక్ష్మితో కలిసి దొంగా-పోలీసు ఆట ఆడుదామని లలితా దేవి పిలిచింది. అనంతరం అత్త కాళ్లకు తాళ్లు కట్టి పెట్రోల్ పోసి నిప్పు అంటించింది. విచారణకు వచ్చిన పోలీసులకు దేవుడి గదిలో దీపం పడడంతో కాలిపోయినట్లు స్టోరీ అల్లింది. దర్యాప్తు చేయగా.. అసలు నిజం బయటపడింది.


