News December 10, 2025

పోలింగ్‌కు ఏర్పాట్లు సిద్ధం.. 890 పంచాయతీలు ఏకగ్రీవం

image

TG: రేపు జరిగే తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు చేసినట్లు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కుముదిని ప్రెస్‌మీట్లో తెలిపారు. తొలి, రెండో విడతల్లో 890 గ్రామాల్లో ఏకగ్రీవమైనట్లు చెప్పారు. ఇప్పటివరకు తనిఖీల్లో రూ.8.2Cr సీజ్ చేశామన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ పటిష్ఠ బందోబస్తు చేపట్టిందని తెలిపారు. 50వేల మంది సివిల్ పోలీసులు, 60 ప్లటూన్స్ టీమ్స్ విధుల్లో ఉన్నట్లు వెల్లడించారు.

Similar News

News December 12, 2025

హనుమాన్ చాలీసా భావం – 36

image

సంకట హటై మిటై సబ పీరా|
జో సుమిరై హనుమత బలవీరా||
శక్తిమంతుడు, పరాక్రమవంతుడు అయిన హనుమంతుడిని ఎవరైతే భక్తితో స్మరించుకుంటారో, వారికి కలిగే అన్ని రకాల సంకటాలు, ఇబ్బందులు వెంటనే తొలగిపోతాయి. వారిని పీడిస్తున్న బాధలు, దుఃఖాలు కూడా పూర్తిగా చెరిగిపోతాయి. హనుమంతుడి స్మరణ అనేది భక్తులకు బలం, ధైర్యం, కష్టాల నుంచి విముక్తిని ప్రసాదిస్తుంది. <<-se>>#HANUMANCHALISA<<>>

News December 12, 2025

ఎయిమ్స్ కల్యాణి 172 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

image

పశ్చిమ బెంగాల్‌లోని ఎయిమ్స్ కల్యాణిలో 172 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 15వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో MD,DNB,DM,MCH, MSc,M.biotech,M.Stat, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. డిసెంబర్ 26, 27 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://aiimskalyani.edu.in/

News December 12, 2025

వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణకు ఢిల్లీ హైకోర్టుకే ఎందుకు?

image

టాలీవుడ్ <<18541857>>నటులు<<>> వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఇక్కడ కోర్టులకు కాకుండా ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారంటే?.. కాపీరైట్, IT, పర్సనాలిటీ రైట్స్ వంటి జాతీయ స్థాయి వాణిజ్య వివాదాల పరిష్కారానికి ఢిల్లీ హైకోర్టు కేంద్రంగా పనిచేస్తోంది. కేంద్ర ప్రభుత్వం, అనేక టెక్ దిగ్గజాలు ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తాయి. ఢిల్లీ HC ఉత్తర్వులు దేశం మొత్తం వర్తిస్తాయని దీన్ని ఆశ్రయిస్తుంటారు.