News November 22, 2025

పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు సిద్ధం చేయాలి: KMR కలెక్టర్

image

గ్రామ పంచాయతి ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు వీలుగా జిల్లాలోని వివిధ ఎన్నికల కార్యకలాపాలకు నోడల్ అధికారులను నియమిస్తూ కామారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. శిక్షణ, రవాణా, భద్రత, మౌలిక వసతులు, వ్యయ పర్యవేక్షణ వంటి కీలక విభాగాలకు అధికారులను నియమించారు. పోలింగ్ స్టేషన్లలో తాగునీరు, విద్యుత్, ర్యాంపులు వంటి మౌలిక సదుపాయాలను సిద్ధం చేయాలని ఆదేశించారు.

Similar News

News November 22, 2025

‘ఫ్రీ స్కూటీ స్కీమ్’.. PIBFactCheck క్లారిటీ

image

‘ప్రధానమంత్రి ఫ్రీ స్కూటీ స్కీమ్’ పేరుతో SMలో జరుగుతోన్న ప్రచారం పూర్తిగా ఫేక్‌ అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కాలేజీ విద్యార్థినులకు ఉచిత స్కూటీలు ఇస్తారని వైరల్ అవుతున్న పోస్టులు ఫేక్ అని PIBFactCheck తేల్చింది. ప్రజలు ఇలాంటి మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే సందర్శించాలని పేర్కొంది.

News November 22, 2025

ఏలూరు జిల్లాలో యాక్సిడెంట్.. ఒక్కరు మృతి

image

ఏలూరు జాతీయ రహదారిలోని దుగ్గిరాల సమీపంలో శనివారం తెల్లవారుజామున యాక్సిడెంట్ జరిగింది. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి బైక్‌పై వస్తున్న వ్యక్తి ఢీకొట్టాడు. ప్రమాదంలో ఘటన స్థలంలోనే బైక్ నడుపుతున్న వ్యక్తి మృతి చెందాడు. ఘటన స్థలానికి చేరుకున్న హైవే సేఫ్టీ సిబ్బంది మృతదేహాన్ని ఏలూరు సర్వజన హాస్పిటల్‌కి తరలించారు. మద్యం మత్తులో ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. మృతుడి వివరాలు సేకరిస్తున్నారు.

News November 22, 2025

బ్లీచ్‌ చేయించుకుంటున్నారా?

image

చర్మం అందంగా మెరుస్తూ ఉండటంతో పాటు ట్యానింగ్ పోవాలని పార్లర్‌కి వెళ్లి చాలామంది స్కిన్‌కి బ్లీచ్ అప్లై చేయించుకుంటారు. బ్లీచ్‌ను చర్మానికి అప్లై చేసేముందు మాయిశ్చరైజర్ రాసి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత బ్లీచ్ చేయించుకోవాలి. బయటకు వెళ్లినప్పుడు తప్పకుండా సన్‌స్క్రీన్ లోషన్ వాడాలి. లేకపోతే చర్మం పొడిబారిపోతుంది. అలాగే బయట నుంచి వచ్చిన వెంటనే చర్మానికి బ్లీచ్ అప్లై చేయకూడదు.