News December 20, 2025

పోలియో నిర్మూలనకు సమష్టిగా కృషి చేయాలి: కలెక్టర్‌

image

పోలియో పూర్తిగా అంతమైనప్పటికీ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ లక్ష్మీశ సూచించారు. శనివారం పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పల్స్‌ పోలియో అవగాహన ర్యాలీని వీఎంసీ కమిషనర్‌ ధ్యాన్‌చంద్రతో కలిసి ఆయన ప్రారంభించారు. స్వర్ణాంధ్ర-వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా చుక్కలు వేయించాలని చెప్పారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News December 26, 2025

ఆయుష్ సర్జరీలు CM, మంత్రులకూ చేయాలి: పీవీ రమేశ్

image

AP: PG <<18651050>>ఆయుర్వేద<<>> వైద్యులను సర్జరీలు చేసేందుకు అనుమతించడంపై రిటైర్డ్ IAS PV రమేశ్ వ్యంగ్యంగా స్పందించారు. ‘AP కిరీటంలో ఇదో కలికితురాయి. ఈ ఆయుష్ శస్త్రచికిత్సలను ఉద్యోగులకే కాకుండా CM, Dy CM, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వారి కుటుంబ సభ్యులకూ తప్పనిసరి చేస్తారని ఆశిస్తున్నాం’ అని సెటైరికల్ ట్వీట్ చేశారు. వినూత్న ఆవిష్కరణలతో ఆంధ్రులను ముంచెత్తుతున్నారని వెటకారమాడారు.

News December 26, 2025

డీలిమిటేషన్‌: GHMCలో కొత్తగా 6 జోన్లు

image

TG: GHMC డీలిమిటేషన్‌కు సంబంధించి ప్రభుత్వం తుది నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జోన్లు, సర్కిళ్లు, డివిజన్ల సంఖ్యను పెంచింది. ప్రస్తుతం ఉన్న 6 జోన్లను 12కు, 30 సర్కిళ్లను 60కి, డివిజన్లను 300కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్‌గిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్‌లను కొత్త జోన్లుగా పేర్కొంది.

News December 26, 2025

సిరిసిల్ల: కాంగ్రెస్ జిల్లా నూతన కార్యవర్గానికి దరఖాస్తుల ఆహ్వానం

image

కాంగ్రెస్ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యవర్గ పదవుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. డిసెంబర్ 26న శుక్రవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు కాంగ్రెస్ కార్యాలయంలో PCC అబ్జర్వర్లు ఫక్రుద్దీన్, కృష్ణ చైతన్య రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సంగితం శ్రీనివాస్ అందుబాటులో ఉంటారు. ఆసక్తి గల వారు ఓటర్ IDతో పాటు రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకుని దరఖాస్తు చేసుకోవాలని పార్టీ PRO తెలిపారు.