News April 25, 2025

పోలీసులకు సవాల్‌గా మారిన వీరయ్య హత్య కేసు?

image

మంగళవారం రాత్రి ఒంగోలులో జరిగిన వీరయ్య హత్య కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. ఇప్పటి వరకు ఐదుగురు అనుమానితులను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. అయితే హత్య జరిగిన ప్రదేశానికి స్థానిక పోలీస్ స్టేషన్‌కు 500 మీటర్లు ఉంది. హత్య జరిగిన విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి ఎస్పీ వెళ్లడానికి అరగంట పట్టింది. ఈ సమయంలో చుట్టుపక్కల చెక్‌పోస్టులను అలర్ట్ చేసి ఉంటే దుండగులు దొరికే వారని పలువురు ఆరోపిస్తున్నారు.

Similar News

News April 25, 2025

మేధా పాట్కర్‌ అరెస్ట్

image

సామాజిక కార్యకర్త మేధాపాట్కర్‌ను పరువునష్టం కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. 2000లో ‘నర్మదా బచావో’ ఆందోళనకు వ్యతిరేకంగా ప్రస్తుత LG VK సక్సేనా ప్రకటనలు ప్రచురించారని ఆరోపిస్తూ ఆయనపై పాట్కర్‌ కేసు వేశారు. అదే సమయంలో ఓ ఇంటర్వ్యూలో తన పరువుకు భంగం కలిగించేలా మాట్లాడారని ఆమెపై సక్సేనా సైతం పరువు నష్టం దావా వేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం ఇటీవల ఆమెకు కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

News April 25, 2025

నరసరావుపేటలో రూ.10 కోట్ల భారీ స్కామ్..!

image

నరసరావుపేట, విజయవాడలో ఇటీవల వెలుగు చూసిన సినీ యానిమేషన్ స్కామ్‌లో నగరానికి చెందిన పలువురు రైల్వే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు భారీగా మోసపోయారు. స్కామ్‌ నిర్వాహకుడు కిరణ్‌కు వీరంతా రూ.10 కోట్ల వరకు ముట్టచెప్పినట్లు తెలుస్తోంది. అతడు దేశం వదిలి పారిపోయాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసును ప్రభుత్వం CIDకి అప్పగించి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

News April 25, 2025

విజయవాడ: రూ.10 కోట్ల భారీ స్కామ్..!

image

విజయవాడ, నరసరావుపేటలో ఇటీవల వెలుగు చూసిన సినీ యానిమేషన్ స్కామ్‌లో నగరానికి చెందిన పలువురు రైల్వే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు భారీగా మోసపోయారు. స్కామ్‌ నిర్వాహకుడు కిరణ్‌కు వీరంతా రూ.10 కోట్ల వరకు ముట్టచెప్పినట్లు తెలుస్తోంది. అతడు దేశం వదిలి పారిపోయాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసును ప్రభుత్వం CIDకి అప్పగించి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

error: Content is protected !!