News December 22, 2025
పోలీసుల అభ్యున్నతికి క్రమశిక్షణే పునాది: SP అజిత

పోలీసుల అభ్యున్నతికి క్రమశిక్షణే పునాది అని ఎస్పీ అజిత వేజెండ్ల అన్నారు. సోమవారం ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్లకు శిక్షణ ప్రారంభం అయింది. దీనికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రస్తుతం సైబర్ నేరాలు పెరిగాయని వాటిని అరికట్టాలంటే పోలీసులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరమన్నారు. చట్టాలపై అవగాహన అవసరమని, దేహధారుడ్యం, మనోనిబ్బరంపై దృష్టిసారించాలని ఆమె కోరారు.
Similar News
News December 31, 2025
నెల్లూరు : 2 నుంచి రీ సర్వే

నెల్లూరు జిల్లాలో నాలుగో విడత భూముల రీసర్వే ప్రక్రియ జనవరి 2వ తేదీ నుంచి మొదలవుతోంది. AP రీసర్వే ప్రాజెక్టులో జిల్లా నందు 93 గ్రామాలు ఎంపిక చేశారు. ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ నుంచి 26 గ్రామాలు, కావలి డివిజన్ నుంచి 26, గూడూరు డివిజన్ నుంచి 14, నెల్లూరు డివిజన్ 27 గ్రామాలు కలిపి 357270.62 ఎకరములు రీసర్వే చేయనున్నారు. రైతులు రీసర్వేలో పాల్గొనాలని జేసీ వెంకటేశ్వర్లు, DD వై.నాగశేఖర్ కోరారు.
News December 31, 2025
నెల్లూరు: సాగులో సమస్యలా.. ఈ నంబర్లకు కాల్ చేయండి

జిల్లాలో సాగు సమస్యలు వస్తే ఎవరిని సంప్రదించాలి.. ఏ మందులు వాడాలి.. సస్యరక్షణ చర్యలు ఏంటి.. ఎరువులు ఏ మొతాదులో వేయాలి.. వంటి సమస్యలకు వ్యవసాయశాఖ కొన్ని ఫోన్ నంబర్లను అందుబాటులోకి తీసుకోచ్చింది.
-వరి, పప్పు ధాన్యాలు, నూనె గింజలు : 0861-2327803, 9490327424
-వేరుశనగ : 9440566582
-ఉద్యాన, వ్యవసాయ పంటలు(తెగుళ్లు : 0861-2349356, 9490004254
– ఉద్యానపంటలు: 7995088181 (ఉద్యాన శాఖ )
News December 31, 2025
కలెక్టర్ @100 days : సక్సెస్ మీట్

జిల్లాలో కలెక్టర్గా హిమాన్షు శుక్ల బాధ్యతలు తీసుకొని 100 రోజులు అయింది. నెల్లూరు కలెక్టరేట్ తిక్కన భవనంలో ఆయన చిట్ చాట్ నిర్వహించారు. బాధ్యతలు చేపట్టే సమయంలో తనకు ఇండోసోల్ కంపెనీ భూసేకరణ సమస్య తీవ్రంగా ఉండిదని, 1200 ఎకరాలు భూసేకరణ చేశామన్నారు. BPCL కు 6 వేల ఎకరాలు అవసరం కాగా.. 3 వేలు సేకరించామని, అది జిల్లా విభజనలో ఒంగోలుకు వెళ్లిందని, ఇంకా.. 3 వేలు కావలి ని.లో చేయాల్సి ఉందని తెలిపారు.


