News September 26, 2024
పోలీసుల సమస్యలు పరిష్కరిస్తాం: ఎస్పీ
జిల్లా పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ వారి సమస్యల పరిష్కారం కోసం గురువారం శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ మహేశ్వరరెడ్డి పోలీసు గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఈ క్రమంలో జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తిస్తున్న 32 మంది పోలీసులు వారి వ్యక్తిగత, ఉద్యోగ సమస్యలను ఎస్పీకి తెలియజేశారు. ఎస్పీ సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.
Similar News
News October 11, 2024
దువ్వాడ శ్రీనివాస్-దివ్వెల మాధురిపై కేసు నమోదు
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన సన్నిహితురాలు దివ్వెల మాధురిపై గురువారం తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల తిరుమల క్షేత్రాన్ని దర్శించిన వీరు తిరుమల మాడ వీధుల్లో అభ్యంతరకరంగా వ్యవహరించారన్న ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీటీడీ అధికారులు ఫిర్యాదు మేరకు దువ్వాడ శ్రీనివాస్, మాధురిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
News October 10, 2024
తెలంగాణ DSCలో కొర్లకోట యువతి సత్తా
ఆమదాలవలస మండలం కొర్లకోట గ్రామానికి చెందిన పేడాడ హిమ శ్రీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఉపాధ్యాయ పరీక్షలలో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్ట్ ఫలితాలకు సంబంధించి రాష్ట్రంలో 9వ ర్యాంక్ సాధించింది. ఈమె తండ్రి ప్రభాకరరావు స్కూల్ అసిస్టెంట్గా సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం ఉన్నత పాఠశాలలో పని చేస్తున్నారు. తల్లి గృహిణి. హేమ శ్రీ ఎంపిక పట్ల తల్లిదండ్రులు గ్రామస్థులు అభినందనలు తెలిపాలి.
News October 10, 2024
శ్రీకాకుళం: భూ సమస్యలు తక్షణమే పరిష్కరించాలి
భూ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తహసీల్దార్లకు ఆదేశించారు. తహసీల్దార్లుతో కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పిజిఆర్ఎస్ అర్జీలపై గురువారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న ఎలినేషన్స్ పైన మండలాల వారీగా ఆయన సమీక్షించారు. ఎలినేషన్స్ ప్రతిపాదనలు తక్షణమే పంపాలని ఆదేశించారు. కోర్టు కేసులు ఎక్కడెక్కడ పెండింగ్లో ఉన్నది తెలుసుకోవాలని చెప్పారు.