News October 19, 2025

పోలీసు స్టేషన్‌లను తనిఖీ చేసిన ఎస్పీ

image

SP సతీష్ కుమార్ శనివారం రాత్రి పుట్టపర్తి అర్బన్, బుక్కపట్నం, కొత్తచెరువు ఆఫ్ గ్రేడ్ పోలీస్ స్టేషన్లతో పాటు జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. నేరాల నియంత్రణ, అక్రమ రవాణా, ప్రజల భద్రత, అసాంఘిక కార్యకలాపాలు పూర్తిగా అరికట్టే దిశగా దృష్టి సారించాలని సిబ్బందికి సూచించారు. రాత్రిపూట పోలీసుల గస్తీ, పెట్రోలింగ్, తనిఖీలు చేస్తున్నారా అని స్వయంగా పరిశీలించడానికి తనిఖీలు చేపట్టామన్నారు.

Similar News

News October 19, 2025

ములుగు: బాణసంచా షాపుల వద్ద ఇవి తప్పనిసరి!

image

దీపావళి సందర్భంగా జిల్లాలో బాణసంచా దుకాణాల వద్ద నిబంధనలు పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మండే స్వభావం కలిగిన వస్తువులు దుకాణాల వద్ద ఉంచొద్దని, ఒక్కో షాపుకు కనీసం 3 మీటర్ల దూరం తప్పనిసరిగా ఉండాలన్నారు. దుకాణాల వద్ద 4 ఫైర్ బకెట్లను ఏర్పాటు చేయాలన్నారు. రెండింటిని పొడి ఇసుక, మరో రెండింటిని నీటితో నింపాలన్నారు. బాణసంచా షాపుల వద్ద పొగ తాగడాన్ని నిషేధించాలన్నారు. ఫైర్ స్టేషన్ నంబర్ ఉండాలన్నారు.

News October 19, 2025

జగిత్యాల: 6 నెలలుగా రేషన్ డీలర్లకు అందని కమీషన్

image

రేషన్ డీలర్లకు ఆరు నెలలుగా వారికి రావలసిన కమీషన్ అందడం లేదు. జిల్లాలో 592 రేషన్ షాపులు ఉండగా.. మొత్తం 3,48,058 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందుకోసం దాదాపు 6500 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. రేషన్ డీలర్లకు క్వింటాలు బియ్యానికి రూ.140 చొప్పున కమీషన్ ఇస్తుండగా, ఇందులో కేంద్రం రూ.90, రాష్ట్రం రూ.50 చెల్లిస్తోంది. అయితే గత మే నెల నుంచి డీలర్లకు రావాల్సిన కమీషన్ రావడం లేదు.

News October 19, 2025

మోదీ కర్నూలు పర్యటనలో భద్రతా లోపం!

image

AP: ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు పర్యటనలో భద్రతా లోపం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హెలిప్యాడ్ వద్ద ప్రధానికి వీడ్కోలు పలికే సమయంలో పాస్‌ల జాబితాలో లేని ఇద్దరు వ్యక్తులు భద్రతా వలయంలోకి ప్రవేశించినట్లు సమాచారం. వీఐపీ పాస్‌లు తీసుకుని బీజేపీ నేతల పేర్లతో ట్యాంపర్ చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత భారీ భద్రత ఉన్నా ఇలా జరగడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.