News April 22, 2025

పోలీస్ కస్టడీకి గోరంట్ల మాధవ్

image

మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను గుంటూరు మొబైల్ కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఈ నెల 23, 24 తేదీల్లో రెండు రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు మాధవ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. పోలీస్‌ సిబ్బందిపై దాడి కేసులో ఆయనను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Similar News

News April 22, 2025

KNR: సెమిస్టర్ పరీక్షల నిర్వహణకు నిరాకరణ

image

KNR SU పరిధిలోని డిగ్రీ SEM పరీక్షల నిర్వహణకు సహకరించబోమని ప్రైవేట్ కళాశాలల సంఘం SUPMA తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పరీక్ష ఫీజులు చెల్లించామని, రాష్ట్ర ప్రభుత్వం గత 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న RTF, MTF బకాయిల విడుదలపై స్పష్టత వచ్చేవరకు పరీక్షల నిర్వహణను నిరాకరిస్తున్నట్లు SUPMA రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి శ్రీపాద నరేశ్ SU అధికారులకు వినతిపత్రం ఇచ్చారు.

News April 22, 2025

వరంగల్: తేలనున్న 12,321 మంది విద్యార్థుల భవితవ్యం!

image

వరంగల్ జిల్లాలో ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరాల్లో ఈ ఏడాది 12,321 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మంగళవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. మొదటి సంవత్సరం జనరల్‌లో 4,967 మంది, ఒకేషనల్- 848, ద్వితీయ సంవత్సరం జనరల్-5,739, ఒకేషనల్‌ 767 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను వేగంగా Way2News యాప్‌లో చూసుకోవచ్చు. #SHARE IT

News April 22, 2025

విశాఖలో నేటి కాయగూరల ధరలు

image

విశాఖలోని 13 రైతు బజార్‌లలో కొనుగోలు చేసే కూరగాయల ధరలను వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు మంగళవారం ఈ విధంగా నిర్ణయించారు. ఉల్లి రూ.18, వంకాయలు రూ. 15, బంగాళాదుంపలు రూ.18,కాకరకాయ రూ.30,బీరకాయలు రూ.32, బెండకాయలు రూ.22,క్యాబేజీ రూ.15,గోరు చిక్కుడు రూ.32,పొటల్స్ రూ.30,కాప్సికం రూ.40,టమాటా రూ.16, క్యారట్ రూ.26/28,దొండకాయలు రూ.18, బీన్స్ రూ.48,కీర దోస రూ.20, చేమ దుంపలు రూ.32, మిర్చి రూ.24గా ఉన్నాయి.

error: Content is protected !!