News March 24, 2025

పోలీస్ కుటుంబాలు నన్ను తిట్టుకుంటున్నాయి: MLA

image

చిత్తూరు జిల్లాలో పోలీసు కుటుంబాలు తనను తిట్టుకుంటున్నాయని పలమనేరు MLA అమర్‌నాథ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పుంగనూరులో టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్య అనంతరం వైసీపీకి అనుకూలంగా పని చేసిన వారిని మార్చమని అడిగితే.. SP ఇష్టానికి బదిలీలు చేశారని ఆరోపించారు. దీంతో వారి భార్యా పిల్లలు తనను ద్వేషిస్తున్నారన్నారు. ప్రజా ప్రతినిధులు శాశ్వతం కాదని, అధికారులే శాశ్వతం అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News March 26, 2025

రొంపిచర్ల : విద్యార్థుల నమోదు కోసం పోటా పోటీ ప్రచారం

image

విద్యార్థులను తమ పాఠశాలలో చేర్పించండంటూ ప్రభుత్వ ఉన్నత పాఠశాల టీచర్లు రొంపిచర్ల మండలంలో పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. 6 తరగతిలో పిల్లలను నమోదు చేసుకునేందుకు 5 తరగతి చదువుతున్న పిల్లలను కలిసి ప్రభుత్వ స్కూల్లో చేరమని కోరుతున్నారు. మరోపక్క ఏపీ మోడల్ స్కూల్ టీచర్లు కూడా ప్రచారం ముమ్మరం చేస్తూ ఇంటింటికి వెళ్లి పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను టీచర్లు అభ్యర్థిస్తున్నారు.

News March 25, 2025

ఈసారైనా రామకుప్పం ఎంపీపీ ఎన్నిక జరిగేనా?

image

రామకుప్పం మండలంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే ఎంపీపీ ఎన్నిక 5 సార్లు వాయిదా పడింది. మొత్తం 15 మంది MPTCలకు గాను వైసీపీకి చెందిన సుమారు 7 మంది ఎంపీటీసీలు టీడీపీ కండువా కప్పుకున్నారు. కాగా ఈ ఎన్నికను టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు సమాచారం. వైస్ ఎంపీపీ పదవికి ఇరు పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కాగా ఈసారైనా ఎన్నిక జరుగుతుందా లేదా వేచి చూడాల్సిందే.

News March 25, 2025

నాగలాపురం: బాలికపై అత్యాచారం.. కేసు నమోదు

image

ఉ.చిత్తూరు(D) నాగలాపురం(M)లోని ఓ కాలనీలో 17 ఏళ్ల బాలికపై అత్యాచారం ఘటనలో చరణ్(23)పై కేసు నమోదు చేసినట్లు SI సునీల్ కుమార్ తెలిపారు. నిందితుడు పెళ్లి చేసుకుంటానని బాలికను నమ్మించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు ఆయన తెలిపారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI పేర్కొన్నారు.

error: Content is protected !!