News April 17, 2025
పోలీస్ డాగ్ స్క్వాడ్ యూనిట్ను పరిశీలించిన ప్రకాశం ఎస్పీ

ఒంగోలులోని జిల్లా పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో బుధవారం డాగ్ స్క్వాడ్ యూనిట్ను ఎస్పీ దామోదర్ పరిశీలించారు. అక్కడ ఉన్న వివిధ జాగిలాలను, వాటి గదులను, అందించే ఆహారాన్ని, వాటికి ఉపయోగించే వివిధ రకాల పరికరాలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వేసవి కాలం దృష్ట్యా డాగ్ స్క్వాడ్లోని జాగిలాలకు వాతావరణం అనుకూలంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సిబ్బందికి సూచించారు.
Similar News
News April 19, 2025
ప్రకాశం: వీరిద్దరే దొంగలు.. జాగ్రత్త

ఇటీవల ప్రకాశం జిల్లాలో దొంగతనాలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో తాళ్లూరు పోలీసులు శుక్రవారం ఇద్దరు దొంగల ఫోటోలను రిలీజ్ చేశారు. తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్గా వీళ్లు దొంగతనాలు చేస్తున్నారు. అనాథాశ్రమానికి సహాయం చేయండంటూ ముందుగా మహిళ తాళాలు వేసిన ఇళ్లను గమనిస్తుంది. ఆ తర్వాత మరో వ్యక్తికి సమాచారం అందిస్తే అతను దొంగతనం చేస్తాడు. వీరితో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.
News April 18, 2025
క్రికెట్ బెట్టింగ్ కేసులో సింగరాయకొండ వాసి అరెస్ట్

క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో సింగరాయకొండకు చెందిన వైసీపీ నేత వెంకట్రావు గురువారం అరెస్టయ్యారు. బెట్టింగ్లో ఓడిపోయిన కడప వాసి సతీశ్ కుమార్ వెంకట్రావుకు రూ. 2 లక్షలు ఇవ్వాల్సి ఉంది. ఆ నగదు కోసం వేధిస్తున్నాడని సతీశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏపీ గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచినట్లు ఎస్సై మహేంద్ర తెలిపారు. నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించి నెల్లూరు జైలుకు తరలించారు.
News April 18, 2025
తిరుమలలో ఒంగోలు వాసుల కారు దగ్ధం

తిరుమలలో ప్రమాదం తప్పింది. ఒంగోలుకు చెందిన భక్తులు కారులో తిరుమలకు వచ్చారు. కొండపై ఉన్న కౌస్తుభం పార్కింగ్ ప్రాంతంలో నిలిపారు. కారులో అకస్మాత్తుగా పొగలు వచ్చాయి. వెంటనే భక్తులు దిగేశారు. తర్వాత కొద్దిసేపటికే కారులో మంటలు చెలరేగాయి. వాహనం మొత్తం కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.