News March 11, 2025
పోలీస్ పిజిఆర్ఎస్ కు 122 ఫిర్యాదులు : జిల్లా ఎస్పీ

జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని కొత్తపేట వద్ద ఉన్న సోమవారం జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమానికి 122 ఫిర్యాదులు అందాయని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఫిర్యాదులను పరిశీలించి విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని బాధితులకు హామీ ఇచ్చారు.
Similar News
News March 11, 2025
నటుడు పోసానికి బెయిల్ మంజూరు

సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఊరట లభించింది. ఆదోని పోలీసులు నమోదు చేసిన కేసులో ఆయనకు కర్నూలు మొదటి అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ (జేఎఫ్సీఎం) బెయిల్ మంజూరు చేశారు. ప్రస్తుతం ఆయన కర్నూలు జిల్లా జైలులో ఉన్న విషయం తెలిసిందే. కాగా చంద్రబాబు, పవన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని జనసేన నేత ఫిర్యాదుతో గతేడాది ఆదోని పీఎస్లో పోసానిపై కేసు నమోదైంది.
News March 11, 2025
కర్నూలు: ఇంటర్ పరీక్షల్లో ముగ్గురు డిబార్

జిల్లా వ్యాప్తంగా మంగళవారం జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పరీక్షలో చూచి రాతకు పాల్పడిన ముగ్గురు విద్యార్థులను డిబార్ చేసినట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి గురువయ్య శెట్టి తెలిపారు. 24,729 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 23,979 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 739 విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేదు. నగరంలోని గవర్నమెంట్ ఒకేషనల్ కళాశాలలో ముగ్గురు విద్యార్థులు డిబార్ అయ్యారు.
News March 11, 2025
ఆదోని పోలీసుల కస్టడీ పిటిషన్ డిస్మిస్

సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై ఆదోని పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ను కర్నూలు మొదటి అదనపు జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ (జేఎఫ్సీఎం) అపర్ణ డిస్మిస్ చేశారు. మరోవైపు బెయిల్ పిటిషన్పై ఇరువైపులా వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వు చేశారు. నేడు వెల్లడించే అవకాశం ఉంది. చంద్రబాబు, పవన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని జనసేన నేత ఫిర్యాదుతో గతేడాది ఆదోని పీఎస్లో పోసానిపై కేసు నమోదైంది.