News October 10, 2025
పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి: VZM SP

విజయనగరం జిల్లా పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ప్రత్యేకంగా ‘పోలీసు వెల్ఫేర్ డే’ కార్యక్రమాన్ని తన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది నుంచి వ్యక్తిగత, శాఖాపరమైన విజ్ఞాపనలు స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపడతానని తెలిపారు. పోలీసు సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ, ప్రతి సమస్యపై స్వయంగా స్పందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
Similar News
News October 10, 2025
VZM: జిల్లా అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు

విజయనగరం జిల్లాలో రేపటి నుంచి రెండు రోజుల పాటు ఎలక్ట్రానిక్ పరికరాల ఎగ్జిబిషన్ కం సేల్ నిర్వహించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. అధికారులతో శుక్రవారం వీసీ నిర్వహించి పలు సూచనలు చేశారు. మండల స్థాయి, నియోజకవర్గం, మున్సిపాలిటీ & జిల్లా స్థాయిలో ఈ ఎగ్జిబిషన్లు జరగాలన్నారు. ప్రజలకు GST అవగాహనతో పాటు తక్కువ ధరల్లో ఎలక్ట్రానిక్ వస్తువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
News October 10, 2025
ఓటర్ల జాబితా సవరణపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందే: DRO

ఓటర్ల జాబితా సవరణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిందేనని DRO శ్రీనివాసమూర్తి స్పష్టం చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో తన ఛాంబర్లో సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితాలో సవరణకు వచ్చిన దరఖాస్తులు 7 రోజుల్లోగా పరిష్కారం కావాలన్నారు. ప్రతి రోజు క్లెయిమ్స్పై AERO, సంబంధిత BLOలతో మాట్లాడాలని, ఏ రోజు క్లెయిమ్స్ ఆ రోజే పరిష్కరిస్తే పెండింగ్ ఉండవని చెప్పారు.
News October 10, 2025
ఏ ఒక్క పత్తి రైతూ నష్టపోకుండా చూడాలి: VZM జేసీ

ఏ ఒక్క పత్తి రైతు నష్టపోకుండా చూడాలని అధికారులను జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాదవన్ ఆదేశించారు. పత్తి కొనుగోళ్లపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం జేసీ ఛాంబర్లో శుక్రవారం జరిగింది. పత్తి రైతు ఈ-క్రాప్ కచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. ప్రభుత్వం పత్తికి మద్దతు ధర క్వింటా రూ. 8,110గా నిర్ణయించిందని, ఈ విషయాన్ని RSKల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.