News September 18, 2025

పోషకాహారంతో ఆరోగ్యమే మహాభాగ్యం: KMR కలెక్టర్

image

సరైన పోషకాహారం తీసుకోవడం ద్వారా శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారని KMR కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. లింగంపేట మండలం పోతాయిపల్లిలో జరిగిన ‘స్వచ్ఛతా హీ సేవ-2025’, ‘పోషక్ అభియాన్’ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేశారు. ‘పోషక్ అభియాన్’ ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో పోషక మాసం నిర్వహిస్తూ పౌష్టికాహారం విలువను తెలియజేస్తున్నామన్నారు.

Similar News

News September 18, 2025

రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు: APSDMA

image

AP: రాబోయే 4 రోజులు దక్షిణకోస్తా, రాయలసీమలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని APSDMA అంచనా వేసింది. రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. కోనసీమ, తూ.గో., ప.గో., ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, శ్రీసత్యసాయి తదితర జిలాల్లో మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని చెప్పింది.

News September 18, 2025

జిల్లాలో ఎరువుల కొరత లేదు: కలెక్టర్

image

ఏలూరు జిల్లాలో ఇప్పటివరకు 83,761 మెట్రిక్ టన్నుల ఎరువులు రైతులకు సరఫరా చేసినట్లు కలెక్టర్ కె.వెట్రిసెల్వి గురువారం తెలిపారు. ప్రస్తుతం 29,512 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉండగా, మరో 259 మెట్రిక్ టన్నులు రానున్నాయని చెప్పారు. ఎరువుల కొరత లేదని స్పష్టం చేస్తూ, రైతులు మోతాదుకు మించి ఎరువులు వాడవద్దన్నారు. పంటలకు తగిన మోతాదులపై గ్రామ స్థాయి సిబ్బంది అవగాహన కల్పించాలని సూచించారు.

News September 18, 2025

పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి: కలెక్టర్

image

జిల్లాలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. గురువారం కలెక్టరేట్లో పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి సంస్థ, పర్యాటకం, ఎంప్లాయిమెంట్, కేవీఐబీ అధికారులతో సమావేశమయ్యారు. కొత్త పరిశ్రమలు ఏర్పాటుకు సన్నాహక చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి చెందినప్పుడే స్థిరమైన వృద్ధిరేటు సాధించగలమన్నారు.