News April 10, 2025
పోషణ్ అభియాన్-2025 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: జనగామ కలెక్టర్

ప్రతి అంగన్వాడీ కేంద్రంలో చేపట్టే పోషణ్ అభియాన్-2025 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో మహిళ శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ అధ్వర్యంలో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్తో కలిసి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఐసీడీఎస్ పోషణ్ అభియాన్-పోషణ పక్షం 2025 కార్యక్రమంపై బుధవారం సమీక్ష నిర్వహించారు.
Similar News
News December 20, 2025
చైనా అభివృద్ధి వెనుక ఒకేఒక్కడు.. ఎవరంటే?

ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయిలో ఉన్న చైనా 1978కి ముందు పేదరికంతో కొట్టుమిట్టాడిందనే విషయం మీకు తెలుసా? చైనీస్ రాజనీతిజ్ఞుడు డెంగ్ జియావో పింగ్ ఆర్థిక సంస్కరణల ఫలితంగానే ఆ దేశం ఇప్పుడు ఈ స్థాయికి చేరింది. మార్కెట్ వ్యవస్థలో సంస్కరణలు, ప్రైవేటు సంస్థలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు విదేశీ పెట్టుబడులను స్వాగతించడంతో చైనా ఆర్థికంగా పుంజుకుంది. ఫలితంగా కోట్లాది మంది పేదరికం నుంచి బయటపడ్డారు.
News December 20, 2025
పోలియో రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి: అల్లూరి కలెక్టర్

పోలియో రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పిల్లల తల్లిదండ్రులు సహకరించాలని కలెక్టర్ దినేశ్ కుమార్ పిలుపునిచ్చారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాలలోపు చిన్నారులందరికీ విధిగా పోలియో వేయించాలని సూచించారు. శనివారం పాడేరు ఐటీడీఏ కార్యాలయం వద్ద నిర్వహించవలసిన పోలియో కార్యాక్రమానికి సంబంధించిన అవగాహన ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. ఈనెల 21, 22, 23వ తేదీల్లో పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుందన్నారు.
News December 20, 2025
HYD: ‘ఫ్రీ లెఫ్ట్’ రూల్పై పోలీసుల సూచనలు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వాహనదారులు ‘ఫ్రీ లెఫ్ట్’ నిబంధనను కచ్చితంగా పాటించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. లెఫ్ట్ లేన్ను అడ్డుకోవడం వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడి ఇతరులకు ఇబ్బంది కలుగుతుందని పేర్కొన్నారు. రోడ్డుపై ఓపిక, మర్యాదతో కూడిన డ్రైవింగ్ అవసరమని, స్మూత్ ట్రాఫిక్ కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ మేరకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పలుచోట్ల ప్రత్యేక సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు.


