News March 12, 2025

పోసానిపై బాపట్లలో కేసు నమోదు

image

సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళికి మరో షాక్ తగిలింది. ఆయనపై బాపట్ల పోలీస్ స్టేషన్‌లో బుధవారం కొత్తగా కేసు నమోదైంది. తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ బీఆర్ నాయుడుపై పోసాని అసభ్యకర వ్యాఖ్యలు చేశారని టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నాయకుల ఫిర్యాదు మేరకు బాపట్ల పీఎస్‌లో కేసు నమోదు చేశారు.

Similar News

News December 20, 2025

ALERT: ఈ వేరుశనగలు తింటే లివర్ క్యాన్సర్!

image

బూజు పట్టిన వేరుశనగలు తినడం ప్రాణాంతకమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘వీటిలో ఉండే అఫ్లాటాక్సిన్ B1 అనే విషపూరిత రసాయనం కాలేయ కణాలను దెబ్బతీస్తుంది. ఇది శరీరంలోకి చేరితే తీవ్రమైన లివర్ ఫెయిల్యూర్‌కు దారితీయడమే కాకుండా, DNAను మార్పు చేసి భవిష్యత్తులో కాలేయ క్యాన్సర్ వచ్చేలా చేస్తుంది. కాబట్టి ఆహార నిల్వ విషయంలో అప్రమత్తంగా ఉంటూ రంగు మారిన, బూజు పట్టిన గింజలను పారేయాలి’ అని సూచిస్తున్నారు. SHARE IT

News December 20, 2025

అలాంటి చోట వాస్తు ప్రభావం ఉండదా ?

image

వేయి గడపలున్న చోట వాస్తు ప్రభావం ఉండదనుకోవడం భ్రమేనని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘తుపానులు, వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలన్నీ సాంకేతిక, భౌగోళిక అంశాలు. వాటి వల్ల జరిగే నష్టాలను వాస్తుతో ముడిపెట్టకూడదు. చుట్టూ ఎన్ని ఇళ్లు ఉన్నా మన ఇంటి వాస్తు మనకు ముఖ్యం. వాస్తు అనుసరిస్తూనే, ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేలా ఇంటి నిర్మాణం ఉండాలి’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>

News December 20, 2025

సిరిసిల్ల: ‘మీ డబ్బు.. మీ హక్కు కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలి’

image

క్లెయిమ్ చేసుకోని ఆర్థికపరమైన ఆస్తుల కోసం ఈ నెల 22 వ తేదీన ‘మీ డబ్బు.. మీ హక్కు’ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రోగ్రామ్ కన్వీనర్, లీడ్ బ్యాంక్ మేనేజర్ మల్లికార్జున రావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని, క్లెయిమ్ చేసుకోని ఆర్థికపరమైన ఆస్తుల వాస్తవ యజమానులు వాటిని పొందేందుకు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.