News March 31, 2024

‘పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలి’

image

ఎన్నికల విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగి పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. శనివారం అయన హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు,జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికలలో పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్ శాతం పెరిగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిచందన, అధికారులు పాల్గొన్నారు.

Similar News

News September 9, 2025

NLG: ఓపెన్ టెన్త్, ఇంటర్‌కు గడువు పెంపు

image

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరానికి ఓపెన్ టెన్త్, ఇంటర్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈ నెల 12 వరకు పొడిగించినట్లు చిట్యాల ఎంఈవో సైదా నాయక్ తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. ఆలస్య రుసుముతో ఈ నెల 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు.

News September 9, 2025

జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

image

జిల్లాలో టైఫాయిడ్ కేసులు పెరుగుతున్నాయని, ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతపై దృష్టి పెట్టేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారులు తప్పనిసరిగా పాఠశాలలను సందర్శించాలని ఆదేశించారు. రక్షిత మంచినీరు సరఫరాపై ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ, పరిశుభ్రతపై పంచాయతీరాజ్ శాఖలు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు.

News September 8, 2025

మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్షకు దరఖాస్తు చేసుకోండి: DEO బిక్షపతి

image

నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్ష కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈవో భిక్షపతి తెలిపారు. ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని, ఏడో తరగతిలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని చెప్పారు. దరఖాస్తులను http://bsc.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫీజు చెల్లించి సమర్పించాలని కోరారు.