News February 12, 2025

పోస్టుమార్టం నిర్వహణ పటిష్ఠంగా జరగాలి : వరంగల్ కలెక్టర్

image

వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆసుపత్రిలో పోస్టుమార్టం కేంద్ర నిర్వహణ పటిష్ఠంగా జరిగేలా దానికి తగిన అన్నిచర్యలు తీసుకోవాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. శవ పరీక్షల నిర్వహణపై జరిగిన సమావేశంలో కలెక్టర్ సత్యశారద దిశా నిర్దేశం చేశారు. శవాల పోస్టుమార్టం సకాలంలో జరగాలని, పోస్టుమార్టం చేసే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు.

Similar News

News November 4, 2025

జూబ్లీహిల్స్‌లో HOME VOTING

image

జూబ్లీహిల్స్‌లో EC ఇంటి ఓటింగ్‌ను ప్రారంభించింది. వృద్ధులు, శారీరకంగా వికలాంగులైన ఓటర్లు ఇంటి ఓటింగ్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. 85 ఏళ్లు పైబడిన 84 మంది ఓటర్లు, 40 శాతం శారీరకంగా వికలాంగులైన 19 మంది ఓటెస్తారు. ఓటింగ్ సమయం ఉదయం 9 గంటల నుంచి సా. 5 గంటల వరకు ఉంటుంది. అధికారులు వారి ఇళ్లకు వెళ్లి ఓటు వేయడానికి సహాయం చేస్తారు. నవంబర్ 6న కూడా వారు తమ ఇంటి నుంచే ఓటు వేయడానికి అనుమతిస్తారు.

News November 4, 2025

జూబ్లీహిల్స్‌లో HOME VOTING

image

జూబ్లీహిల్స్‌లో EC ఇంటి ఓటింగ్‌ను ప్రారంభించింది. వృద్ధులు, శారీరకంగా వికలాంగులైన ఓటర్లు ఇంటి ఓటింగ్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. 85 ఏళ్లు పైబడిన 84 మంది ఓటర్లు, 40 శాతం శారీరకంగా వికలాంగులైన 19 మంది ఓటెస్తారు. ఓటింగ్ సమయం ఉదయం 9 గంటల నుంచి సా. 5 గంటల వరకు ఉంటుంది. అధికారులు వారి ఇళ్లకు వెళ్లి ఓటు వేయడానికి సహాయం చేస్తారు. నవంబర్ 6న కూడా వారు తమ ఇంటి నుంచే ఓటు వేయడానికి అనుమతిస్తారు.

News November 4, 2025

వేములవాడ రాజన్న ఆలయ ఇన్చార్జి ఈవోగా రాజేష్

image

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం తాత్కాలిక కార్యనిర్వహణాధికారిగా రాజేష్ నియమితులయ్యారు. ఆలయ ఈవో ఎల్ రమాదేవి వ్యక్తిగత పనులపై సెలవు మీద వెళ్లడంతో సీనియర్ అధికారి అయిన ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాజేష్‌కు తాత్కాలికంగా ఇన్చార్జి ఈవో బాధ్యతలు అప్పగించారు. ఈవో రమాదేవి విధుల్లో చేరే వరకు రాజేష్ ఇన్చార్జి ఈవోగా కొనసాగుతారు.