News March 30, 2024
ప్రకాశం: ఆటోను ఢీకొట్టిన ట్రాక్టర్.. మహిళ మృతి

సింగరాయకొండ మండలం పెదనబోయినవారిపాలెంకు చెందిన కావలి పద్మ, రమాదేవి, ప్రహర్ష సింగరాయకొండ నుంచి ఆటోలో గ్రామానికి బయల్దేరారు. ఊళ్లపాలెం ప్రధాన రహదారి పక్కనే ఉన్న జగనన్న కాలనీ సమీపంలోకి వెళ్లేసరికి ధాన్యం లోడుతో వస్తున్న ట్రాక్టర్ ఆటోని ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న పద్మ, మరో ఇద్దరు గాయపడ్డారు. దీంతో వారిని ఒంగోలు తరలిస్తుండగా పద్మ మధ్యలో మృతిచెందారు. ఎస్సై శ్రీరాం కేసు నమోదుచేశారు.
Similar News
News January 6, 2026
ప్రకాశం, మార్కాపురం జిల్లాలు.. అసలు రూపం ఇదే!

ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు సంబంధించి భౌగోళిక స్వరూపాన్ని అధికారులు రూపొందించారు. ప్రకాశం జిల్లా 28 మండలాలు, 520 గ్రామాలతో ఉండగా.. మార్కాపురం జిల్లా 21 మండలాలతో 508 గ్రామాలతో స్వరూపాన్ని కలిగి ఉన్నట్లు అధికారులు తాజాగా ప్రకటించారు. ఇక విస్తీర్ణం విషయంలో ప్రకాశం జిల్లా 15,58,828.77 ఎకరాలు, మార్కాపురం 14,82,757.24 ఎకరాలు ఉంది.
News January 5, 2026
కనిగిరి: మహిళను హత్య చేసి.. ప్రియుడి సూసైడ్

వెలిగండ్ల(M) కట్టకిందపల్లిలో సోమవారం వివాహిత హత్యకు గురైన విషయం తెలిసిందే. DSP సాయి ఈశ్వర్ వివరాల ప్రకారం.. అద్దంకికి చెందిన సీనావలి కట్టకిందపల్లికి చెందిన నాగజ్యోతికి వివాహేతర సంబంధం ఉండగా సోమవారం సీనావలి ఆమెతో <<18769740>>గొడవపడి హత్య<<>> చేశాడు. గ్రామస్థులకు బయపడి సీనావలి కూడా విష ద్రావణం తాగడంతో కనిగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడన్నారు. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
News January 5, 2026
కనిగిరి వద్ద మహిళ దారుణ హత్య.!

మార్కాపురం జిల్లా వెలిగండ్ల మండలం కట్టకిందపల్లి గ్రామంలో సోమవారం ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. విచారణ చేపట్టామని మరన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని SI కృష్ణ పావని తెలిపారు. హత్యకు గల మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


