News April 30, 2024
ప్రకాశం: ఉచిత ప్రవేశాలకు 696 మంది ఎంపిక

బాలలకు ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం ప్రకారం జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరంలో 1వ తరగతిలో ప్రవేశానికి లాటరీ విధానంలో 696 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్లు డీఈవో సుభద్ర తెలిపారు. వీరిలో బీసీలు 234 మంది, మైనార్టీలు 53 మంది, ఓసీలు 147, ఎస్సీలు 244, ఎస్టీలు 18 మంది ఉన్నారు. ఆయా పాఠశాలల్లో మే 10వ తేదీలోపు సంబంధిత పత్రాలు సమర్పించి ప్రవేశం పొందాలన్నారు.
Similar News
News October 18, 2025
ప్రకాశం: ‘15 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం లక్ష్యం’

ప్రకాశం జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్కు గాను రూ.15వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని జేసీ గోపాలకృష్ణ అన్నారు. ఒంగోలులోని కలెక్టరేట్లో జేసీ సంబంధిత అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలుకు ఇప్పటి నుంచే అవసరమగు ముందస్తు ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా నిర్వహించాలన్నారు.
News October 17, 2025
దేశ అభివృద్ధికి యువతే వెన్నెముక: కలెక్టర్

భారతదేశ అభివృద్ధికి యువతే వెన్నెముకని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అన్నారు. యువతలోని శక్తి, మేధోసంపత్తి సమాజానికి ఎంతో ఉపయోగపడాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా యువజన వ్యవహారాల శాఖ స్టెప్ ఆధ్వర్యంలో శుక్రవారం ఒంగోలులోని స్థానిక ఇంజినీరింగ్ కాలేజీలో జరిగిన జిల్లా స్థాయి యువజన ఉత్సవాల్లో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. యువత దేశ ఉన్నతికి పాటుపడాలన్నారు.
News October 17, 2025
వీరయ్య చౌదరి హత్య.. జైలు నుంచి సురేశ్ విడుదల

ఒంగోలులోని తన కార్యాలయంలో ఏప్రిల్ 24న టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో కీలక నిందితుడు ముప్పా సురేశ్ను ఆగస్ట్ 19న అరెస్ట్ చేశారు. ఒంగోలు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు కోర్టు బుధవారం బెయిల్ ఇచ్చింది. ఆ పత్రాలు జైలుకు చేరడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ప్రతి ఆదివారం ఒంగోలు తాలుకా స్టేషన్కు హాజరు కావాలని కోర్టు షరతులు విధించింది.