News August 26, 2025
ప్రకాశం: ఎటు చూసినా జ్వరాలే..!

ప్రకాశం జిల్లాలో సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్నాయి. పశ్చిమ ప్రకాశంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు. ఇతర ప్రాంతాల్లోనూ వైరల్ ఫీవర్లు ఎక్కువయ్యాయి. చాలా మంది ఒంగోలు రిమ్స్కు తరలి వస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పందించి గ్రామాల్లో శిబిరాలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.
Similar News
News August 26, 2025
ఒంగోలు: 24 ఏళ్ల తర్వాత జైలుశిక్ష

హనుమంతునిపాడు మండలానికి చెందిన ధనేకుల తిరుపతయ్య 2000వ సంవత్సరం సెప్టెంబర్ 4న బాలిక ఉన్న షాపు దగ్గరకు వెళ్లాడు. అక్కడ కూల్డ్రింక్ తీసుకుని తాగాడు. తర్వాత బాలికను బయటకు పిలిచి నోరు మూసిపెట్టి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె కేకలు వేయడంతో పారిపోయాడు. నేరం రుజువు కావడంతో 24 ఏళ్ల తర్వాత ఒంగోలు కోర్టు అతనికి మూడేళ్ల జైలుశిక్ష, రూ.7వేల జరిమానా విధిస్తూ నిన్న తీర్పు చెప్పింది.
News August 26, 2025
చిన్నారిని హింసించిన వ్యక్తికి జైలు శిక్ష

నాగులుప్పపాడు మండలం మాచవరంకి చెందిన ఆంజనేయులు అనే వ్యక్తికి ఒంగోలు కోర్టు సోమవారం 2 సంవత్సరాలు జైలు శిక్ష రూ.10వేల జరిమానా విధించింది. ఓ మహిళతో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్న ముద్దాయి మహిళ కూతురైన చిన్నారిని తమకు అడ్డుగా ఉందని పలుమార్లు హింసించాడు. విచారించిన కోర్టు సాక్షదారాలు పరిశీలించి నిందితుడికి జైలు శిక్ష జరిమానా విధిస్తూ న్యాయమూర్తి కోమల వల్లి తీర్పు ఇచ్చారు. ఈ విషయాన్ని ఎస్పీ తెలిపారు.
News August 26, 2025
అర్జీదారులతో మర్యాదగా మెలగాలి: కలెక్టర్

అర్జీదారులతో అధికారులు మర్యాదపూర్వకంగా మాట్లాడాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో మీకోసం కార్యక్రమం అనంతరం కలెక్టర్, అధికారులతో అర్జీల పరిష్కారంపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అర్జీల పరిష్కారంలో అలసత్వం లేకుండా సకాలంలో పరిష్కరించేలా శ్రద్ధ చూపాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రీవెన్స్ కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఈ విషయాన్ని గుర్తించాలన్నారు.