News April 15, 2024
ప్రకాశం: ఏప్రిల్ వచ్చినా అందని మార్చి నెల జీతం

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సుమారు 300 మంది అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఎస్టీ గురుకుల పాఠశాలలో కొన్నేళ్లుగా ఉపాధ్యాయలుగా పనిచేస్తున్నారు. సమాన పనికి సమాన వేతన పద్ధతి అమలు కానప్పటికి, ఇస్తున్నటువంటి రూ.15 వేలు, నెల నెల జీతం అందడం లేదని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి మార్చి నెల జీతాన్ని విడుదల చేయవలసిందిగా ఉపాధ్యాయులు కోరుతున్నారు.
Similar News
News September 9, 2025
ప్రకాశంకు 3 రోజులు వర్షసూచన.. తస్మాత్ జాగ్రత్త!

ఉపరితల ఆవర్తన ప్రభావంతో మూడు రోజుల పాటు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని APSDMA ప్రకటించింది. ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో అధిక ప్రభావం ఉంటుందని తెలిపింది. గత 3 రోజులుగా తీవ్ర వేడిమిలో బాధపడుతున్న ప్రజలకు ఇది చల్లని కబురు. అయితే మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
News September 9, 2025
ప్రకాశం: బాలింత మృతిపై విచారణకు కలెక్టర్ ఆదేశం!

మాతృ, శిశు మరణాలను నివారించడానికి ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం ఒంగోలు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో MDR సమావేశం జరిగింది. ఏప్రిల్, మే, జూన్ మాసాలలో జిల్లాలో సంభవించిన మాతృ, శిశు మరణాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ 3 నెలల కాలంలో ఒక బాలింత మృతి చెందింది. ఆమె మృతిపై విచారణ చేసి నివేదిక అందజేయాలన్నారు.
News September 9, 2025
వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించడం అభినందనీయం: కలెక్టర్

ఒంగోలు నగర కార్పోరేషన్తో పాటు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఘన వ్యర్థాల నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐటీసీ సంస్థ సరికొత్త కాన్సెప్ట్తో చొరవ తీసుకుంది. స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా మార్కాపురం, కనిగిరి మున్సిపాలిటీలు వ్యర్థాల నిర్వహణపై ఎంఓయూ పూర్తి చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వారు మంగళవారం ఒంగోలులో కలెక్టర్ తమీమ్ అన్సారియాను కలిశారు. ఇది అభినందనీయమని కలెక్టర్ తెలిపారు.