News December 5, 2024

ప్రకాశం: కరెంట్ షాక్‌తో ఇద్దరు యువకుల మృతి

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గురువారం తీవ్ర విషాద ఘటన జరిగింది. కొనకనమిట్ల మండలం సిద్దవరం శివారులోని నిమ్మతోటలో విద్యుత్ లైన్లు లాగుతుండగా కరెంట్ షాక్ తగిలింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు చనిపోయారు. మృతులు పెద్దారవీడుకు చెందిన నాగరాజు (28), రంగారావు(30)గా గుర్తించారు. విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వకుండా పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

Similar News

News September 14, 2025

ప్రకాశం కలెక్టర్, SP వచ్చేశారు.. రేపే తొలి మీకోసం.!

image

ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా రాజబాబు, ఎస్పీగా హర్షవర్ధన్ రాజు బాధ్యతలు చేపట్టారు. ఇటీవల కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ దామోదర్‌లు బదిలీ కాగా, వారి స్థానంలో వీరు బాధ్యతలు చేపట్టారు. కాగా తొలిసారి జిల్లా బాధ్యతలు చేపట్టిన తర్వాత కలెక్టర్ రాజబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజులు సోమవారం ‘‘మీకోసం కార్యక్రమానికి’’ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంతో ప్రజల ముందుకు ఇద్దరూ ఉన్నతాధికారులు రానున్నారు.

News September 14, 2025

SP దామోదర్‌కు వీడ్కోలు

image

ప్రకాశం జిల్లా SP దామోదర్ ఐపీఎస్ విజయనగరానికి బదిలీ అయ్యారు. ఒంగోలు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. 14 నెలల పాటు SPగా విశేష కృషి చేశారని పోలీస్ అధికారులు కొనియాడారు. ప్రత్యేక వాహనంలో వెళ్లిన దామోదర్‌కు పోలీసులు గౌరవ సెల్యూట్ చేశారు. పోలీస్ అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు.

News September 14, 2025

బీజేపీలో చేరిన ఎమ్మెల్సీ పోతుల సునీత!

image

ఎమ్మెల్సీ పోతుల సునీత ఆదివారం BJPలో చేరారు. విశాఖలో జరుగుతున్న సారథ్యం సభలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమెకు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఏపీలో ఎన్నికల అనంతరం వైసీపీకి దూరంగా ఉన్న పోతుల సునీత BJPలో చేరడం చర్చనీయాంశంగా మారింది.