News August 22, 2025
ప్రకాశం: కొత్త జిల్లాలపై మీరేమంటారు?

జిల్లాల పునర్విభజన, కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం మంత్రుల త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మార్కాపురం జిల్లా ఏర్పాటుపై ఎదురుచూస్తున్న ప్రజలకు ఆశలు చిగురించాయి. 30న మంత్రులు సత్య కుమార్, నిమ్మల రామానాయుడు ప్రకాశం జిల్లాకు వచ్చి ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తారు. మార్కాపురం జిల్లా ఏర్పాటు, ఏయే మండలాలు ప్రకాశం, మార్కాపురంలో కలపాలి అనే దానిపై మీ అభిప్రాయాలు చెప్పవచ్చు.
Similar News
News August 22, 2025
భూగర్భ జలాలు పెరిగేలా ప్రణాళికల తయారీ: కలెక్టర్

ప్రకాశం జిల్లాలో భూగర్భ జలమట్టం మరింత పెరిగేలా గ్రామస్థాయిలో వాటర్ మేనేజ్మెంట్ ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం భూగర్భ జల వనరులశాఖ అధికారులతో కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. 20 మీటర్లకంటే ఎక్కువ భూగర్భ జలమట్టం ఉన్న గ్రామాల్లో, జలమట్టం పెరిగే అవకాశంపై ప్రణాళికలు రూపొందించాలన్నారు.
News August 22, 2025
ప్రకాశం: భార్యను గొంతు కోసి హతమార్చిన భర్త

ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలంలోని పీవీపురంలో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. భార్య రామలక్ష్మమ్మను భర్త వెంకటేశ్వర్లు అతి కిరాతకంగా గొంతు కోసి హతమార్చాడు. భార్యపై అనుమానంతోనే వెంకటేశ్వర్లు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News August 22, 2025
ప్రకాశం: కానిస్టేబుల్ అభ్యర్థుల పత్రాల పరిశీలన.. 22 మంది గైర్హాజరు.!

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన కార్యక్రమానికి 327 మంది అభ్యర్థులు హాజరైనట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో సాగిన ధ్రువీకరణ పత్రాల పరిశీలన కార్యక్రమానికి అభ్యర్థులు ఉదయం నుంచే హాజరయ్యారు. అయితే 22 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు అధికారులు ప్రకటించారు.