News February 16, 2025

ప్రకాశం: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

image

పల్నాడు జిల్లా రాజుపాలెం(M) నెమలిపురి దగ్గర అద్దంకి- నార్కెట్ పల్లి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా మద్దిపాడు వెళుతున్న కారును లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు కొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ప్రకాశం జిల్లాకు చెందిన షేక్ నజీమా, నూరుల్లా, హబీబుల్లాగా గుర్తించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News

News December 18, 2025

టంగుటూరు మర్డర్.. మృతుని వివరాలివే.!

image

ప్రకాశం జిల్లా టంగుటూరులో గురువారం ఓ హత్య జరిగిన విషయం తెలిసిందే. మృతుడు మర్రిపూడి మండలం కూచిపూడికి చెందిన వెంకటరమణయ్యగా పోలీసులు గుర్తించారు. రమణయ్య టంగుటూరు ప్రైవేట్ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. రాత్రి నిద్రిస్తున్న సమయంలో దుండగులు ఇంట్లోకి ప్రవేశించి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి భార్య చనిపోగా కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సిఉంది.

News December 18, 2025

టంగుటూరులో వ్యక్తి మర్డర్..?

image

ప్రకాశం జిల్లా టంగుటూరులో గురువారం ఓ బ్యాంక్ సెక్యూరిటీ గార్డ్ హత్యకు గురైనట్లు సమాచారం. విషయం తెలుసుకున్న టంగుటూరు పోలీసులు రంగంలోకి దిగారు. ఇప్పటికే CI హజరతయ్య, SI నాగమల్లేశ్వరరావులు ఘటనా స్థలిని పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు. అలాగే డాగ్ స్క్వాడ్ సైతం ఒంగోలు నుంచి రానున్నట్లు సమాచారం.

News December 18, 2025

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 388 మందికి కౌన్సెలింగ్

image

జిల్లా వ్యాప్తంగా 388 చెడునడత గల వ్యక్తులకు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు చెడునడత గల వ్యక్తులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎక్కడైనా అల్లర్ల సమయంలో వీరి జోక్యం కనిపిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్పీ కార్యాలయం హెచ్చరించింది.