News September 20, 2024
ప్రకాశం జిల్లాలో నేడు CM పర్యటన
ప్రకాశం జిల్లా నాగులుప్పపాడు మండలం మద్దిరాలపాడులో నేడు CM చంద్రబాబు పర్యటించనున్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పాలన పూర్తయిన సందర్భంగా.. ఇది మంచి ప్రభుత్వం పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మధ్యాహ్యం 2 గంటలకు మద్దిపాడు చేరుకుని సాయంత్రం 5 గంటల వరకు మీటింగ్లో పాల్గొంటారు. అధికారులు పర్యటనా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
Similar News
News September 20, 2024
నేడు జగన్ను కలవనున్న MLA తాటిపర్తి
యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ శుక్రవారం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలవనున్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడిన నేపథ్యంలో యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి కూడా పార్టీని వీడతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో అధిష్ఠానం నుంచి ఎమ్మెల్యేకు పిలుపొచ్చింది. దీంతో ఆయన ఇవాళ జగన్ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడనున్నారు.
News September 19, 2024
ఒంగోలు: వారంతా ఒక్కటయ్యారు.. ఫొటో వైరల్
ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గురువారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను మర్యాదపూర్వకంగా కలిసిన విషయం తెలిసిందే. అయితే ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షుడు రియాజ్, జనసేన రాష్ట్ర నాయకురాలు రాయపాటి అరుణను సైతం బాలినేని కలిశారు. ఈ కలయికతో జనసేనలో బాలినేని చేరికకు రియాజ్ అడ్డు తగులుతున్నారన్న వివాదానికి తెర పడింది. మొత్తం మీద వీరి కలయిక ఫొటో వైరల్గా మారింది.
News September 19, 2024
FLASH.. పవన్ కళ్యాణ్తో బాలినేని భేటీ
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కొద్దిసేపటి క్రితం విజయవాడలో కలిశారు. నిన్న YCPకి రాజీనామా చేసిన ఆయన ఇవాళ పవన్ కళ్యాణ్ను కలవడంతో జనసేనలో చేరుతారనే వార్తలకు బలం చేకూరాయి. ఈ నేపథ్యంలో ఆయన ఎప్పడు పార్టీలో చేరుతారు. ఈయనపై గతంలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన జిల్లా జనసేన ఇన్ఛార్జ్ రియాజ్, MLA దామచర్ల ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది.