News June 18, 2024
ప్రకాశం జిల్లాలో పరీక్షల డేట్ ప్రకటన
ఒంగోలులో డీఈఐఈడీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 24 నుంచి 27 వరకు జరుగుతాయని విద్యాశాఖ పరీక్షల విభాగం అధికారి కె. శివకుమార్ తెలిపారు. డైట్ మైనంపాడు కేంద్రంలో జరిగే పరీక్షకు 2022-24 బ్యాచ్ విద్యార్థులు హాజరవుతారన్నారు. ఉదయం 9-11.30 గంటల వరకు పరీక్ష ఉంటుందని, హాల్ టికెట్లు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
Similar News
News October 3, 2024
చీరాలలో పిడుగుపాటుకు విద్యార్థిని మృతి
చీరాల మండలం పాతచీరాలలో తీవ్ర విషాదం నెలకొంది. బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని తులసి పిడుగుపాటుకు గురై గురువారం మృతి చెందింది. దసరా సెలవులు ఇవ్వడంతో తులసి అమ్మమ్మ ఇంటికి వచ్చింది. గురువారం ఉదయం వర్షం పడుతున్న సమయంలో మేడ పైకి వెళ్లింది. అదే సమయంలో తులసి మీద పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందింది.
News October 3, 2024
ఒంగోలులో సందడి చేయనున్న కీర్తి సురేశ్
ఒంగోలులో గురువారం ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేశ్ సందడి చేయనున్నారు. నగరంలోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఉదయం10:30 గంటలకు హాజరుకానున్నారు. వీరితో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధులుగా హాజరుకానున్నారు. హీరోయిన్ కీర్తి సురేశ్ మొదటి సారిగా ఒంగోలుకు వస్తున్న తరుణంలో యువత ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.
News October 3, 2024
ఒంగోలు: నేటి నుంచి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు
ఒంగోలులోని కొండమీద వెలసిన శ్రీగిరి వేంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలను నేటి నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్పర్సన్ ఆలూరు ఝాన్సీ రాణి తెలిపారు. సాయంత్రం 6 గంటలకు బ్రహ్మోత్సవాలు కలశ స్థాపనతో ప్రారంభమవుతాయని చెప్పారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు.