News April 13, 2024

ప్రకాశం జిల్లాలో రూ.1.30 కోట్లు సీజ్

image

జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు పటిష్ఠ చర్యలు చేపట్టామని కలెక్టర్ దినేశ్ కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్, జేసీ గోపాలకృష్ణతో కలిసి మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ఈనెల 11 నాటికి మొత్తం 18,17,162 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఇప్పటివరకు రూ.1.30 కోట్ల విలువైన డబ్బు, మద్యం, తదితర వస్తువులను సీజ్ చేసినట్లు చెప్పారు.

Similar News

News October 5, 2025

ప్రకాశం: 9 పేకాట స్థావరాలపై దాడులు.. 55 మంది అరెస్ట్

image

జిల్లాలో ఆదివారం 9 పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించి 55 మందిని పేకాటరాయుళ్లను అరెస్టు చేసినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఒంగోలు తాలూకా, ఎస్ఎన్ పాడు, ఎస్ కొండ, జరుగుమల్లి, మర్రిపూడి, మార్కాపురంలలో పేకాట స్థావరాల నుంచి రూ. 93,630 నగదు, ఎస్ కొండలో కోళ్ల పందెం రాయుళ్ల వద్ద రూ. 1,27,800 నగదును స్వాధీనం చేసుకున్నారు.

News October 5, 2025

ప్రకాశం జిల్లాకు భారీ వర్ష సూచన

image

రానున్న మూడు గంటల్లో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ తాజాగా ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించగా, ప్రకాశం జిల్లాను ఆరెంజ్ అలర్ట్ జోన్‌గా అధికారులు ప్రకటించారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు తగిన జాగ్రత్త వహించాలని అధికారులు సూచించారు.

News October 5, 2025

ప్రకాశం ప్రజలకు పోలీస్ కీలక సూచన ఇదే!

image

మీ ఆధార్‌కు బయోమెట్రిక్ లాక్ ఉందా.. లేకుంటే సైబర్ నేరగాళ్లతో తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు ప్రకాశం పోలీస్. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఐటీ విభాగం పోలీసులు విస్తృతంగా సైబర్ నేరాలపై సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా ఆధార్‌కు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఆధార్‌కు బయోమెట్రిక్ లాక్ ఏర్పాటు చేసుకోవాలని, అప్పుడే అకౌంట్ లో ఉన్న నగదు భద్రమని పోలీసులు సూచించారు.