News May 11, 2024
ప్రకాశం జిల్లాలో రూ.1.70 కోట్ల నగదు సీజ్

ఈవీఎంల ధ్వంసానికి పాల్పడినా, ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందిపై ఘర్షణకు పాల్పడినా వారిపై అత్యంత తీవ్రమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. జిల్లాలో ఇప్పటివరకు రూ.5.30కోట్ల విలువైన నగదు, మద్యం, బంగారు, వెండి ఆభరణాలు, ఇతర వస్తువులను, వాహనాలను సీజ్ చేశామన్నారు. వీటిలో నగదు రూ.1.70కోట్లు, రూ.50లక్షల విలువైన 26,751 లీటర్ల మద్యం సీజ్ చేసినట్లు పేర్కొన్నారు
Similar News
News November 2, 2025
ప్రకాశం ప్రజలకు ఎస్పీ కీలక సూచనలు..!

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన విషాద ఘటన నేపథ్యంలో జిల్లాలోని భక్తులకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు శనివారం పలు కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం కార్తీకమాసం సందర్భంగా తీర ప్రాంతాలు, శివాలయాలలో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దీపాలు వెలిగించే సమయంలో భక్తితో పాటు జాగ్రత్త వహించాలన్నారు. తీర ప్రాంతాలలో మన అప్రమత్తతే మనకు రక్ష అని సూచించారు.
News November 1, 2025
నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటాం: కలెక్టర్

తుఫాన్ వలన నష్టపోయిన రైతులందరిని ఆదుకుంటామని కలెక్టర్ రాజబాబు హామీ ఇచ్చారు. మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యేతో కలిసి మాట్లాడారు. రికార్డు స్థాయిలో తుఫాన్ వల్ల 20 సెంటీమీటర్ల వర్షం నమోదయిందన్నారు. ఫలితంగా వాగులు, వంకల ప్రవాహం పెరగడంతో పంట పొలాలు, రోడ్లు దెబ్బతిన్నట్లు తెలిపారు. పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించినట్లు వివరించారు.
News November 1, 2025
ప్రకాశం ప్రజలకు ఎస్పీ కీలక సూచనలు..!

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన విషాద ఘటన నేపథ్యంలో జిల్లాలోని భక్తులకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు శనివారం
పలు కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం కార్తీకమాసం సందర్భంగా తీర ప్రాంతాలు, శివాలయాలలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారన్నారు. ఈ కర్రమంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దీపాలు వెలిగించే సమయంలో భక్తితో పాటు జాగ్రత్త వహించాలన్నారు. తీర ప్రాంతాలలో మన అప్రమత్తతే మనకు రక్ష అన్నారు.


