News March 23, 2024
ప్రకాశం జిల్లాలో YCP ఇప్పటివరకూ గెలవని స్థానాలు
2019లో వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా 151 సీట్లు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 9 స్థానాలు కైవసం చేసుకుంది. కానీ వైసీపీ ఆవిర్భావం నుంచి జిల్లాలో ఇప్పటికీ కొన్ని చోట్ల ఆ పార్టీ గెలవలేకపోయింది. అవే చీరాల, కొండపి, పర్చూరు స్థానాలు. అభ్యర్థుల మార్పుతో ఎలాగైనా ఈసారి గెలవాలని గట్టి పట్టుదలతో అధిష్ఠానం భావిస్తోంది. దీంతో ఈ సారి ఎన్నికల్లో ఆ స్థానాల్లో జెండా ఎగురవేయాలని భావిస్తోంది.
Similar News
News July 3, 2024
జాతీయ స్థాయికి ఎంపికైన ఒంగోలు విద్యార్థినులు
జాతీయస్థాయి ఆర్చరీ పోటీలకు ఒంగోలులోని ఓ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు ఎంపికైనట్లు పాఠశాల పర్యవేక్షణ అధికారి వసుంధర దేవి పేర్కొన్నారు. ఐదో తరగతి చదువుతున్న అభిలాష, నాలుగో తరగతి చదువుతున్న గీతాంజలి జూన్ 20న విజయవాడలో జరిగిన అండర్-13 విభాగంలో రాణించారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించారు.
News July 3, 2024
ప్రకాశం: ప్రేమ పేరుతో మోసం.. యువకుడి అరెస్టు
ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన ఓ యువకుడిపై కేసు నమోదు చేసినట్లు హనుమంతునిపాడు ఎస్సై తెలిపారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన అవినాశ్ కొంతకాలంగా బంధువుల అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. ఆమెకు మాయ మాటలు చెప్పి శారీరకంగా దగ్గరవడంతో గర్భం దాల్చింది. పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో అతను తప్పించుకు తిరుగుతున్నాడు. బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించామన్నారు.
News July 3, 2024
శానంపూడి ఎంఎల్హెచ్పీ ఆత్మహత్య
శృంగవరపు కోట మండలం శానంపూడి హెల్త్ సెంటర్లో ఎంఎల్హెచ్పీగా పనిచేస్తున్న రమావంత్ రవినాయక్ (33) ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం రైలు పట్టాలపై రవినాయక్ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు ఆదివారం ఆయన స్కూటీపై వచ్చి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. మృతదేహం కుళ్లిన స్థితిలో ఉందని వారు వెల్లడించారు. పోలీసులు సంఘటనా స్థలం సమీపంలో స్కూటీని గుర్తించారు.