News March 15, 2025

ప్రకాశం జిల్లా టీచర్‌కు నేషనల్ అవార్డు

image

ప్రకాశం జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. సింగరాయకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల తెలుగు టీచర్ గాయత్రి విభిన్న ప్రతిభావంతుల జాతీయ సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు. ఢిల్లీలో ఈనెల 7వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరిగిన కార్యక్రమంలో ఆమె తన సాహిత్యాన్ని ప్రదర్శించారు. దీంతో అవార్డు అందుకున్నారు. ఆమెను స్కూల్ ఉపాధ్యాయులు అభినందించారు.

Similar News

News January 2, 2026

మార్కాపురం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

image

ఈ ఘటన పల్నాడు జిల్లాలో జరిగింది. మార్కాపురానికి చెందిన షేక్ కరీముల్లా(50), మాచర్లకు చెందిన నూర్జహాన్(45) బంధువులు. ఇద్దరూ ఫ్రూట్స్ బిజినెస్ చేస్తుంటారు. మాచర్ల నుంచి మార్కాపురానికి బైకుపై గురువారం బయల్దేరారు. వెల్దుర్తి మండలం శిరిగిరిపాడుకు చెందిన మహేశ్ బైకుపై మాచర్లకు పయనమయ్యాడు. శిరిగిరిపాడు వద్ద ఈ రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. కరీముల్లా, నూర్జహాన్ చనిపోగా మహేశ్ తీవ్రంగా గాయపడ్డాడు.

News January 1, 2026

మార్కాపురానికి CM రాక?

image

మార్కాపురం జిల్లాలో జనవరి మొదటి వారంలో సీఎం చంద్రబాబు రానున్నట్లు సమాచారం. వెలుగొండ ప్రాజెక్ట్ సందర్శన, ఫీడర్ కెనాల్ పనులను ప్రారంభించడానికి వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం మార్కాపురం జిల్లాగా ప్రకటించిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు పర్యటన ప్రత్యేకతను సంతరించుకోనుందని చెప్పవచ్చు. కాగా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

News January 1, 2026

మార్కాపురం పర్యటనకు సీఎం చంద్రబాబు రాక?

image

మార్కాపురం జిల్లాలో జనవరి మొదటి వారంలో సీఎం చంద్రబాబు రానున్నట్లు సమాచారం. వెలుగొండ ప్రాజెక్ట్ సందర్శన, ఫీడర్ కెనాల్ పనులను ప్రారంభించడానికి వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం మార్కాపురం జిల్లాగా ప్రకటించిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు పర్యటన ప్రత్యేకతను సంతరించుకోనుందని చెప్పవచ్చు. కాగా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.