News June 16, 2024

ప్రకాశం: తండ్రి కోసం విగ్రహం కట్టించిన కుమారులు

image

కన్న తండ్రికి కుమారులు ఏకంగా గుడి కట్టిన ఘటన సీఎస్‌పురం మండలం కొండ్రాజుపల్లిలో జరిగింది. మట్లే బోడెయ్య, కొండమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. బోడెయ్య వ్యవసాయం చేసి కుమారులను చదివించారు. ప్రస్తుతం పెద్ద కుమారుడు మాలకొండలరావు రైల్వేలో, చిన్న కుమారుడు సచివాలయంలో పని చేస్తున్నారు. ఈ క్రమంలో 2021లో బోడెయ్య మృతి చెందగా.. కుమారులిద్దరు తమ పొలంలో బోడెయ్యకు గుర్తుగా గుడి కట్టి ఆయన విగ్రహాన్ని అందులో ఉంచారు.

Similar News

News February 21, 2026

చదివేది సింగరాయకొండ.. హాజరు కనిగిరి

image

సింగరాయకొండ చైతన్య పాఠశాలలో అనుమానస్పదంగా మృతి చెందిన తౌషిక్ విచారణలో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తౌషిక్ మరణించిన తర్వాత శుక్రవారం రోజు కూడా కనిగిరిలో ప్రగతి విద్యా నిలయంలో పాఠశాలకు వచ్చినట్లు హాజర వేశారు. త్రిసభ్య కమిటీలో ఉన్న డీఈవో రేణుక ఇది గమనించి అవాక్కయ్యారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని కౌశిక్ తల్లిదండ్రులు అంటున్నారు.

News February 21, 2026

APK ఫైల్స్‌, లింకులను ఓపెన్ చేయొద్దు: కనిగిరి DSP

image

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కనిగిరి DSP సాయి ఈశ్వర్ యశ్వంత్ అన్నారు. ఈ మధ్య కాలంలో SBI పేరుతో Aadhaar KYC Update”, “SBI Aadhaar Update.apk”వంటి ఫైళ్లు, వాట్సాప్, ఇతర సోషల్ మీడియా ద్వారా మెసేజ్‌లు వస్తున్నాయని తెలిపారు. APK ఫైల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్‌లోడ్ లేదా క్లిక్ చేయకూడదని స్పష్టం చేశారు.

News February 21, 2026

CM వెలిగొండ పర్యటనపై కీలక సమావేశం

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శుక్రవారం తాడేపల్లిలోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం కావడానికి తీసుకోవాల్సిన చర్యలు, భద్రతా ఏర్పాట్లు, ప్రాజెక్ట్ పరిసరాల్లో చేపట్టాల్సిన పనులపై సమావేశంలో చర్చించారు. అలాగే ఎల్లుండి సీఎంతో సమావేశం నేపథ్యంలో వివరించాల్సిన అంశాలపై మాట్లాడుకున్నారు.