News August 13, 2025

ప్రకాశం: తుఫాన్ ఎఫెక్ట్.. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టినట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. బుధవారం తహశీల్దార్లతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. తుఫాన్ కారణంగా ఏమైనా సమస్యలు ఎదురైతే, కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 1077కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.

Similar News

News August 14, 2025

ప్రకాశం జిల్లాలోని కంది సాగు రైతులకు శుభవార్త.!

image

ప్రకాశం జిల్లాలో 2 రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రధానంగా కంది సాగు చేసే రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. ఈ స్థితిలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు గురువారం Way2Newsకు పలు విషయాలు వెల్లడించారు. సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 70 వేల హెక్టార్ల కంది సాగవుతుందన్నారు. ప్రస్తుతం 40 శాతం సబ్సిడీపై కంది విత్తనాలు ఇవ్వనున్నట్లు, రైతులు RSK కేంద్రాలను సంప్రదించాలన్నారు.

News August 14, 2025

మార్కాపురం జిల్లా ఓకే.. మిగిలిన వీటి సంగతేంటి?

image

సీఎం చంద్రబాబు కొత్త జిల్లాల ఏర్పాటుపై దృష్టి సారించారు. ఇప్పటికే మంత్రుల కమిటీ దీనిపై దృష్టి సారించింది. మార్కాపురం జిల్లా ఖాయమన్న వార్తలు గుప్పుమంటుండగా, కందుకూరు పరిస్థితి ఏమిటన్న చర్చలు జోరందుకున్నాయి. ఇలా కందుకూరును కలిపేస్తారా? లేక అద్దంకిని ఒంగోలులోకి మిళితం చేస్తారా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఏదొక డివిజన్‌ను కలిపితే ప్రకాశం నిండుగా ఉంటుందన్నది ప్రజల వాదన.

News August 14, 2025

ఒంగోలు: అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణకు అవకాశం

image

ఈ ఏడాది జూన్ 30లోగా వేసిన అనధికార లేఅవుట్లను, ప్లాట్లను చట్టబద్ధం చేసుకోవడానికి అక్టోబర్ 24 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జేసీ గోపాలకృష్ణ తెలిపారు. బుధవారం ఒంగోలులో సర్వేయర్లతో జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఎల్ఆర్ఎస్ స్కీం ఒక గొప్ప అవకాశమని పేర్కొన్నారు.