News March 22, 2024
ప్రకాశం: పెండింగ్లో రెండు సీట్లు

ఇవాళ టీడీపీ మూడో జాబితాలో చీరాల టికెట్ను కొండయ్యకు కేటాయించింది. ఇక దర్శి ఎమ్మెల్యే, ఒంగోలు ఎంపీ స్థానాలు పెండింగ్లో ఉంచాయి. దర్శి టికెట్ పొత్తులో భాగంగా జనసేనకు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే గరికపాటి వెంకట్కు కేటాయిస్తారని వార్తా కథనాలు వెలువడ్డాయి. ఒంగోలు ఎంపీ టికెట్ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డికి టీడీపీ నుంచి ఇస్తారని టాక్.
Similar News
News July 6, 2025
ప్రకాశం జిల్లా వాసులకు SP హెచ్చరిక

ప్రకాశం జిల్లా SP ఏ.ఆర్ దామోదర్ శనివారం పలు PSలలో తనిఖీలు చేశారు. ఈ క్రమంలో కనిగిరి PSను సందర్శించి మాట్లాడారు. జిల్లాలో మొహర్రం వేడుకలను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వేడుకల్లో ఎక్కడైనా శాంతి భద్రతలకు విగాథం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News July 6, 2025
’10న మెగా పేరెంట్ – టీచర్ మీటింగ్’

ప్రకాశం జిల్లాలో ఈనెల 10వ తేదీన జరిగే మెగా పేరెంట్ – టీచర్ మీటింగ్ను విజయవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణ అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలల్లో ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. తల్లిదండ్రులు కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలన్నారు.
News July 5, 2025
పవన్ రాకతో.. జిల్లా జనసేన ఆల్ సెట్.!

ప్రకాశం జిల్లాలో జనసేన సెట్ అయినట్లేనన్న టాక్ నడుస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ రాకతో జనసేన బలోపేతంపై క్యాడర్ దృష్టిసారించనున్నట్లు ప్రచారం సాగుతోంది. విభేదాలు వీడి ఒకే తాటిపైకి రావాలని మార్కాపురం పర్యటన సందర్భంగా వన్ నాయకులకు సూచించినట్లు సమాచారం. దీనితో జిల్లాలో క్యాడర్ ఒకే తాటిపైకి వచ్చి పార్టీపై దృష్టి సారించే పరిస్థితి ఉందట. చివరికి పవన్.. జిల్లాలో ఆల్ సెట్ చేసినట్లేనని టాక్ వినిపిస్తోంది.