News September 10, 2025
ప్రకాశం: పోస్టల్ స్కాలర్షిప్ పొందాలని ఉందా?

ప్రకాశం జిల్లాలోని విద్యార్థులకు పోస్టల్ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఏటా దీన్ దయాల్ స్పర్శ్ యోజన స్కాలర్షిప్ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. 6 నుంచి 9వ తరగతి చదివే విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. విద్యార్థులు అర్హత పొందేందుకు రాత పరీక్ష, ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ నెల 30న రీజనల్ స్థాయి పరీక్ష ఉండగా, ఆసక్తి కలవారు ఈ నెల 16లోగా స్థానిక పోస్టాఫీస్ను సంప్రదించాలి.
Similar News
News April 5, 2026
పామూరు: నాన్నా జాగ్రత్త అని అరచేతిపై రాసుకుని.. కూతురి సూసైడ్

మార్కాపురం(D)లో శనివారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. పామూరు (M) అయ్యవారిపల్లికి చెందిన మాధవి.. నాగూర్ బాషా <<19569072>>లైంగిక వేధింపులకు<<>> గురి చేస్తున్నాడని ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆదివారం ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. చనిపోయే ముందు మాధవి ‘నాన్నా జాగ్రత్త’ అంటూ తన అరచేతిపై రాసుకోవడం అందరిని కంటతడి పెట్టించింది. నాగూర్ మాధవిని నగ్న చిత్రాలతో వేధిస్తున్నట్లు సమాచారం.
News April 5, 2026
ప్రకాశం: జూన్లో పెట్టుబడిదారుల సదస్సు ఏర్పాటుకు ఆదేశం

ప్రకాశం జిల్లాలో పారిశ్రామికీకరణ వేగవంతం చేసేందుకు అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది. జూన్ నెలాఖరులో పెట్టుబడిదారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. దీనికోసం తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ రాజాబాబు శనివారం ప్రకాశం భవనంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి, అధికారులకు దిశానిర్దేశం చేశారు. పరిశ్రమల స్థాపనకు జిల్లాలో అందుబాటులో ఉన్న భూములను గుర్తించాలని అధికారులను ఆదేశించారు.
News April 5, 2026
ప్రకాశం జిల్లా యువతకు గుడ్ న్యూస్

ప్రకాశం జిల్లా నిరుద్యోగ యువతకు అత్యాధునిక రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం కీలక అడుగులు వేస్తోంది. కలెక్టర్ రాజాబాబు సమక్షంలో ప్రముఖ ‘సెంచూరియన్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా యువతకు డిమాండ్ ఉన్న రంగాల్లో ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. పరిశ్రమలు, ప్రభుత్వం, విద్యారంగం మధ్య బలమైన భాగస్వామ్యానికి ఈ ఒప్పందం వేదికగా మారనుందని తెలిపారు.


