News December 12, 2025
ప్రకాశం ప్రజలకు.. సైబర్ నేరాలపై కీలక సూచన.!

వాట్సాప్లలో వచ్చే క్యూ-ఆర్ కోడ్ల పట్ల ప్రకాశం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రకాశం SP కార్యాలయం సూచించింది. SP హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు.. సైబర్ నేరాల నియంత్రణకై IT విభాగం పోలీసులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు గురువారం క్యూఆర్ కోడ్ గురించి కీలక సూచన చేశారు. అపరిచిత వ్యక్తులు పంపించే క్యూఆర్ కోడ్ల పట్ల అప్రమత్తంగా లేకుంటే, సైబర్ నేరానికి గురయ్యే అవకాశం ఉందని సూచించారు.
Similar News
News December 14, 2025
ప్రకాశం: కొద్ది దూరమే కదా అనుకుంటే.. ప్రాణానికే ప్రమాదం

ప్రకాశం జిల్లాలోని వాహనదారులకు SP హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో ఐటీ విభాగం పోలీసులు కీలక సూచనలు చేశారు. కొద్ది దూరమని రాంగ్ రూట్ ప్రయాణం చేస్తే ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరించారు. దూరంకంటే ప్రాణం ముఖ్యమనే విషయాన్ని వాహనదారులు గమనించాలని కోరారు. రాంగ్ రూట్ వెళ్లకుండా వాహనదారులు సహకరించాలన్నారు. కాదని అతిక్రమిస్తే కఠిన చర్యలు, జరిమానాలు విధిస్తామన్నారు.
News December 14, 2025
ప్రకాశం:10th విద్యార్థులకోసం ఇలా..!

ప్రకాశం జిల్లాలో 10వ తరగతి విద్యార్థులపై 100 రోజుల యాక్షన్ ప్లాన్ పక్కాగా నిర్వహించాలని ఒంగోలు డిప్యూటీ డిఈఓ చంద్రమౌళీశ్వర్ అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో గల పీజీఆర్ఎస్ హాలులో శనివారం ఒంగోలు, కొండేపి, సంతనూతలపాడు నియోజకవర్గాల హెచ్ఎం, ఎంఈఓలకు 100 రోజుల యాక్షన్ ప్లాన్పై సమావేశం నిర్వహించారు. ప్రతి పాఠశాలలోని విద్యార్థులు 100% పాస్ అయ్యేలా లక్ష్యాన్ని ఎంచుకొని, ప్లాన్ అమలు చేయాలన్నారు.
News December 14, 2025
ప్రకాశంలో నవోదయకు పరీక్షకు 1998 మంది గైర్హాజరు

ప్రకాశం జిల్లాలో శనివారం నిర్వహించిన నవోదయ ప్రవేశ పరీక్షకు 1998 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఒంగోలు నవోదయ ప్రిన్సిపాల్ శివరాం తెలిపారు. ఒంగోలులోని నవోదయ విద్యాలయ వద్ద ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో నవోదయ ఆరో తరగతి ప్రవేశపరీక్ష పకడ్బందీగా నిర్వహించామన్నారు. మొత్తం 5,502 మంది విద్యార్థులకు గాను, 3,504మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు తెలిపారు.


