News December 22, 2025

ప్రకాశం: బిడ్డ మోసానికి.. RDO న్యాయం

image

కన్న బిడ్డ మోసం చేస్తే.. ఒంగోలు ఆర్డీవో లక్ష్మీ ప్రసన్న ఆ తల్లికి న్యాయం చేశారు. ముండ్లమూరు మండలం కొమ్మవరంకు చెందిన రమాదేవికి ఒక కుమారుడు ఉన్నారు. కాగా రమాదేవి పేరుమీద ఉన్న 1.96 ఎకరాల వ్యవసాయ భూమిని ఆమె మృతి చెందినట్లు తప్పుడు సర్టిఫికెట్ సృష్టించి వేరొకరికి ఆ భూమి విక్రయించాడు. రమాదేవి దీనిపై RDOకు ఫిర్యాదు చేయగా స్పందించిన ఆర్డీవో విక్రయాన్ని రద్దుచేసి సహకరించిన అధికారులపై చర్యలకు ఆదేశించారు.

Similar News

News December 25, 2025

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా చిన్నారులకు వైద్య పరీక్షలు

image

ప్రకాశం జిల్లాలో చిన్నారుల ఆరోగ్యానికి మరోసారి ఇచ్చేందుకు చైల్డ్ హెల్త్ స్క్రీనింగ్ పరీక్షలను వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ మేరకు బుధవారం సైతం జిల్లా వ్యాప్తంగా DMHO డాక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశాలతో ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. 0 నుంచి 18 ఏళ్లలోపు విద్యార్థులు 4,04,091 మంది ఉండగా, బాల్యంలో వ్యాధులు ఉన్నవారిగా 314 మందిగా అధికారులు గుర్తించారు.

News December 25, 2025

విద్యుత్ కాంతులతో మెరుస్తున్న మార్కాపురం చర్చి

image

క్రీస్తు జననాన్ని గుర్తుచేసుకుంటూ క్రైస్తవులు Nov 25 నుంచి Dec 25 వరకు క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో విద్యుత్ కాంతులతో మార్కాపురం తెలుగు బాప్టిస్ట్ టౌన్ చర్చి మిలమిల మెరుస్తూ ఆకర్షణీయంగా ఉంది. బుధవారం రాత్రి మెగా క్రిస్మస్ వేడుకలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. క్యారల్స్‌లో ఉత్సాహంగా పాటలు పాడుతూ సందడి చేశారు.

News December 25, 2025

విద్యుత్ కాంతులతో మెరుస్తున్న మార్కాపురం చర్చి

image

క్రీస్తు జననాన్ని గుర్తుచేసుకుంటూ క్రైస్తవులు Nov 25 నుంచి Dec 25 వరకు క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో విద్యుత్ కాంతులతో మార్కాపురం తెలుగు బాప్టిస్ట్ టౌన్ చర్చి మిలమిల మెరుస్తూ ఆకర్షణీయంగా ఉంది. బుధవారం రాత్రి మెగా క్రిస్మస్ వేడుకలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. క్యారల్స్‌లో ఉత్సాహంగా పాటలు పాడుతూ సందడి చేశారు.