News September 23, 2025

ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక

image

ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మంగళవారం రాత్రి వరకు బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో 3,97,250 క్యూసెక్కులుగా ఉంది. దీంతో కృష్ణ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అదే విధంగా కృష్ణ, గుంటూరు జిల్లాల్లో 53 మంది అధికారులకు వరద పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు.

Similar News

News September 23, 2025

ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు

image

భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పోటెత్తుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ నుంచి బ్యారేజీకి వరద నీరు వచ్చి చేరుతోంది. మంగళవారం ఉదయం వరకు బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో 3,37,525 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు. కెఈ మెయిన్, కె డబ్ల్యు మెయిన్‌లకు 8,035, 5,009, కెనాల్స్‌కు 13,044 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ వద్ద నీటిమట్టం 12 అడుగులుగా ఉంది.

News September 23, 2025

గుంటూరు మిర్చీ యార్డులో 50%కు పడిపోయిన అమ్మకాలు

image

గుంటూరు మిర్చీ యార్డులో 50% కు అమ్మకాలు పడిపోయాయి. దసరా ఉత్సవాల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో లారీల రాకపోకలపై నిషేధం విధించారు. దీంతో గుంటూరు మిర్చి యార్డు నుంచి ఎగుమతులు నిలిచిపోయాయి. మిర్చి ధర కూడా క్వింటాకు రూ. 800 వరకు తగ్గుదల అయ్యింది. రానున్న 10 రోజుల్లో రోజుకి 25 వేల టిక్కీల వరకు విక్రయం కూడా కష్టమే అనే మిర్చి ట్రేడర్లు చెబుతున్నారు.

News September 23, 2025

బస్సులో ప్రయాణించి ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

image

DSC నియామక పత్రాల జారీ కార్యక్రమ సభకు వచ్చే వాహనాల రాకపోకల మార్గాలను కలెక్టర్ తమీమ్ అన్సారీయా ఇతర జిల్లా ఉన్నతాధికారులతో కలసి స్వయంగా బస్సులో ప్రయాణించి పరిశీలించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉండే విధంగా అవసరమైన చోట రహదారులను వెడల్పు చేయించడం, మరమ్మతులు చేయించడం వంటి పలు అంశాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఇతర అధికారులు ఉన్నారు.