News April 20, 2025

ప్రకాశం: భార్యను హతమార్చిన భర్త

image

ఉమ్మడి ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం యనమదల గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. భార్య నీలం మంగమ్మ (45)ను భర్త నీలం శ్రీనివాసరావు హతమార్చాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో హత్య జరిగినట్లు ప్రాథమిక సమాచారం. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 20, 2026

మార్కాపురం జిల్లాకు కొత్త లేడీ ఆఫీసర్

image

మార్కాపురం జిల్లా రవాణాశాఖ ఇన్‌ఛార్జ్ అధికారిగా టీవీ నాగలక్ష్మి గురువారం తన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఆమె మాట్లాడుతూ… వాహనదారులందరూ తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బైకుపై వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరించాలని సూచించారు.

News February 20, 2026

ప్రకాశం: బీటెక్ విద్యార్థి మృతి

image

ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలంలో విషాదం నెలకొంది. మంగపతివారిపాలెం గ్రామానికి చెందిన మల్లెబోయిన శ్రీచరణ్ వైజాగ్ ఆంధ్రా యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నాడు. మహాశివరాత్రి సందర్భంగా ఇంటికి వచ్చాడు. గురువారం సాయంత్రం కాలేజీకి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. పొలాల్లో ఉన్న తండ్రికి ఈ విషయం చెప్పడానికి వెళ్లాడు. తిరిగి వస్తూ మధ్యలో ఈతకు దిగి మృతిచెందాడు.

News February 20, 2026

24న ఒంగోలులో సైక్లింగ్ పోటీలు

image

ఒంగోలు మిని స్టేడియంలో ఈనెల 24వ తేదీ జిల్లా స్థాయి సైక్లింగ్ పోటీలు నిర్వహిస్తారని జిల్లా క్రీడాధికారి సంస్థ అధికారిణి జి.రాజరాజేశ్వరి గురువారం తెలిపారు. 18 ఏళ్లు పైబడిన వారి నుంచి మాస్టర్స్ వరకు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని చెప్పారు. ముందుగా క్రీడా యాప్‌లో పేరు నమోదు చేసుకున్న వారికి మాత్రమే పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. ఇక్కడ ప్రతిభ చూపిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతామని చెప్పారు.