News December 21, 2025
ప్రకాశం: మీ పిల్లలకు ఈ చుక్కలు వేయించారా?

ప్రకాశం జిల్లాలో ఆదివారం ఉదయమే పల్స్ పోలియో కార్యక్రమం మొదలైంది. ఆరోగ్య కార్యకర్తలు తమకు కేటాయించిన శిబిరాలకు చేరుకున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకు వచ్చి పోలియో చుక్కలు వేయిస్తున్నారు. ఐదేళ్లలోపు చిన్నారులకు ప్రభుత్వ ఆసుపత్రి, బస్టాండ్, మెయిన్ సర్కిళ్ల వద్ద చుక్కలు వేస్తున్నారు. మీ పిల్లలకూ చుక్కలు వేయించారా? లేదా?
Similar News
News December 21, 2025
ఒంగోలు: ఈతకు వెళ్లి బీటెక్ విద్యార్థి మృతి.. పూర్తి వివరాలివే!

ఒంగోలులోని ఓ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి హర్ష (18) ఈతకు వెళ్లి మడనూరు వద్ద మృతి చెందిన విషయం తెలిసిందే. 9 మంది స్నేహితులతో కలిసి వెళ్లిన హర్ష మడనూరు తీరం వద్దకు చేరుకోగానే మొదటగా ఇద్దరితో కలిసి తీరంలోకి వెళ్లాడు. ఒకరు అలల ధాటికీ తట్టుకోలేక బయటకు రాగా.. హర్ష, రాధాకృష్ణమూర్తి ఊపిరి ఆడని పరిస్థితికి చేరుకున్నారు. అయితే హర్ష మృతి చెందగా.. రాధాకృష్ణను వైద్యశాలకు తరలించారు.
News December 21, 2025
ఉగ్ర నరసింహారెడ్డి రాజకీయ ప్రస్థానం ఇదే.!

ప్రకాశం టీడీపీ అధ్యక్షుడిగా కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ నరసింహారెడ్డి నియమితులైన విషయం తెలిసిందే. 2009లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన ఆ సమయంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయాన్ని అందుకున్నారు. 2015లో ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా సేవలు అందించి, 2019లో టీడీపీలో చేరారు. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయాన్ని అందుకొని, జిల్లా అధ్యక్షుడి పదవిని దక్కించుకన్నారు.
News December 21, 2025
ప్రకాశం జిల్లా TDP అధ్యక్షుడిగా ఉగ్ర నరసింహారెడ్డి

ప్రకాశం జిల్లా TDP అధ్యక్షుడిగా కనిగిరి MLA ఉగ్ర నరసింహారెడ్డిని పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. దీంతో కనిగిరిలో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని ఎప్పటి నుంచో సీఎం చంద్రబాబు చెబుతూనే ఉన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా పట్టి జిల్లాలో TDPకి పునర్వైభవానికి తీసుకొచ్చారని పార్టీ శ్రేణులు చెప్పుకొచ్చారు.


