News April 3, 2024
ప్రకాశం: రూ.2.35 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం

ప్రకాశం జిల్లా అంతర్రాష్ర్ట సరిహద్దు చెక్ పోస్టుల్లో ఇప్పటి వరకు రూ.2.35 కోట్ల విలువైన నగదు, మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి(నిన్న బదిలీ) వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 18 అంతర్రాష్ర్ట సరిహద్దు చెక్ పోస్ట్లను ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరా, కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు చేసి పటిష్ఠంగా తనిఖీలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న నగదు, మద్యం సీజ్ చేశారు.
Similar News
News April 21, 2025
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టీచర్ పోస్టులు ఇలా..!

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో డీఎస్సీ ద్వారా<<16156012>> 629 పోస్టులు<<>> భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. రోస్టర్ వారీగా పోస్టులు ఇలా కేటాయిస్తారు.
➤ OC-259 ➤ BC-A:44 ➤ BC-B:58
➤ BC-C:08 ➤ BC-D:46 ➤ BC-E:25
➤ SC- గ్రేడ్1:08 ➤ SC-గ్రేడ్2:38.
➤ SC-గ్రేడ్3:48 ➤ ST:33 ➤ EWS: 61
➤ PHC-HH:1
News April 21, 2025
ప్రకాశం: పుట్టింటి నుంచి ఆలస్యంగా వచ్చిందని.!

పేర్నమిట్టలో అమానుష ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పేర్నమెట్టకు చెందిన నవీన్.. భార్య శ్రావణి గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆమె పుట్టినిల్లు అయిన జమ్ములపాలెంకు వెళ్లింది. అదే రోజు రమ్మని నవీన్ కోరగా ఆమె మరుసటి రోజు వచ్చింది. దీంతో అనుమానం పెంచుకున్న నవీన్ ఆదివారం ఆమె గొంతు మీద కాలు పెట్టి తొక్కడంతో ఆమె మృతి చెందింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 20, 2025
బేస్తవారిపేట: పిడుగుపాటుకు ఇద్దరు యువకులు మృతి

బేస్తవారిపేట మండలం పెద్ద ఓబినేనిపల్లిలో విషాదం నెలకొంది. ఆదివారం క్రికెట్ ఆడుతుండగా పిడుగు పడటంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు పెద్ద ఓబులేనిపల్లికి చెందిన ఆకాశ్, సన్నీగా గ్రామస్థులు గుర్తించారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.