News October 9, 2024
ప్రకాశం: రైతు బజార్ కేంద్రాల్లో టమాటాలు విక్రయాలు
ప్రకాశం జిల్లాలోని అన్ని రైతు బజార్ కేంద్రాలలో నిన్నటి నుంచి రాయితీపై టమాటాలు అందిస్తున్నట్లు ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. ఒక కిలో రూ.50 చొప్పున విక్రయిస్తున్నామన్నారు. ఒక కుటుంబానికి రెండు కిలోలు మాత్రమే అందిస్తామని, తమ వెంట ఆధార్ జిరాక్స్ లేదా రేషన్ కార్డు జిరాక్స్ను తమ వెంట తీసుకుని రావాలని కోరారు. అవకాశాన్ని ప్రజల వినియోగించుకోవాలన్నారు.
Similar News
News October 9, 2024
పొన్నలూరు: విద్యార్థిని మృతి..నలుగురిపై వేటు
పొన్నలూరు (మం) ముళ్లమూరివారిపాలెం విద్యార్థి మైథిలి గతనెల 29న రోడ్డు ప్రమాదంలో మరణించింది. దీనికి సంబంధించి నలుగురి ఉపాధ్యాయులపై డీఈవో సుభద్ర సస్పెండ్ చేశారు. 28న బాలిక పల్నాడు జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్-19 ఫుల్ బాల్ పోటీలో పాల్గొని, 29న ఒంగోలుకు చేరుకుంది. బస్టాండు నుంచి ఓ వ్యక్తి బైకుపై వెళుతుండగా..ప్రమాదంలో కన్నుమూసింది. దీంతో క్రీడాకారుల పట్ల సరైన రక్షణ తీసుకోలేదని వేటు వేశామన్నారు.
News October 9, 2024
ఒంగోలులో ప్రాథమిక ఆహార పరీక్షల ప్రయోగశాల: మంత్రి సత్యకుమార్
రాష్ట్రంలో ఆహార భద్రతా ప్రమాణాల్ని మరింత పెంపొందించడానికి భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థతో, ఏపీ ప్రభుత్వం రూ.88.41 కోట్లతో మంగళవారం న్యూఢిల్లీలో ఒప్పందాన్ని (MoU) కుదుర్చుకుంది. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్తో కలిసి ఒప్పందపత్రాలపై సంతకాలు చేశారు. ఒప్పందాలలో భాగంగా ఒంగోలులలో ప్రాథమిక ఆహార పరీక్షల ప్రయోగశాల రూ. 7.5 కోట్లతో నెలకొల్పనున్నాట్లు మంత్రి తెలిపారు.
News October 8, 2024
ప్రకాశం జిల్లా అభివృద్దికి కృషి చేస్తా: MP మాగుంట
రానున్న రోజుల్లో ప్రకాశం జిల్లా అభివృద్దికి కృషి చేస్తానని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. మంగళవారం ఒంగోలులోని ప్రకాశం భవనంలో స్వర్ణాంధ్ర-2047 విజన్ రూపకల్పనలో ఎంపీ పాల్గొని మాట్లాడారు. విజన్ డాక్యుమెంట్లో భాగంగా జిల్లాను ఏ విధంగా అభివృద్ది చేసుకోవాలన్న విషయంపై ప్రతిఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు. అలాగే సి.ఎస్.ఆర్ నిధులను సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.