News May 11, 2024
ప్రకాశం: వైన్స్ షాప్కు భారీగా మందు బాబులు
మే 13న ఎన్నికలు జరుగుతున్నందున, వైన్స్ షాప్లు రెండు రోజులు మూత పడనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని వైన్స్ షాప్లు దగ్గర మందు బాబులు భారీగా లైన్లు కట్టి మద్యం కొనుగోలు చేస్తున్నారు. మద్యం షాపులు తెరిచిన వెంటనే మద్యం మొత్తం అమ్ముడు పోవడంతో వైన్స్ షాప్లు కొన్ని చోట్ల మూత వేశారు. కాగా, ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాప్లు ఉంటాయని, ఆ తర్వాత మూత పడతాయన్న విషయం తెలిసిందే.
Similar News
News September 30, 2024
ఒంగోలు: హిజ్రాలు ఆత్మగౌరవంతో బతకాలి: ఎస్పీ
హిజ్రాలు ఆత్మగౌరవంతో బతకాలని ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ సూచించారు. ఒంగోలులో సోమవారం హిజ్రాలు ఎస్పీని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిజ్రాలు ఎదుర్కొంటున్న సామాజిక వివక్ష, అణచివేతలు నుంచి గర్వంగా సభ్య సమాజంలో తలెత్తుకొని బ్రతకాలని ఎస్పీ అన్నారు. హిజ్రాలు గ్రూపులుగా విడిపోయి శాంతి భద్రతల సమస్యలు సృష్టించడం, బలవంతపు వసూళ్లకు పాల్పడితే ఆత్మగౌరవం దెబ్బతింటుందన్నారు.
News September 30, 2024
చంద్రబాబు, పవన్ ముక్కు నేలకు రాయాలి: తాటిపర్తి
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ముక్కు నేలకు రాసి హిందువులకు క్షమాపణలు చెప్పాలని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఫైర్ అయ్యారు. ‘తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, పవిత్రమైన వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని అవమానించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ముక్కు నేలకు రాసి హిందువులకు, రాష్ట్ర, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అని Xలో పోస్ట్ చేశారు.
News September 30, 2024
ప్రకాశం: పింఛన్ల పంపిణీకి రూ.122.64 కోట్లు విడుదల
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అక్టోబర్ నెలకు సంబంధించి ప్రకాశం జిల్లాలోని 2,88,144 మంది లబ్ధిదారులకు రూ.122.64 కోట్లు విడుదలైనట్లు డీఆర్డీఏ పీడీ వసుంధర తెలిపారు. 2వ తేదీ గాంధీజయంతి కావడంతో 1న పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు చెప్పారు. ఈ మేరకు మంగళవారం జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ పూర్తి చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. అధికారులు బ్యాంకుల నుంచి నగదు విత్డ్రా చేసుకోవాలన్నారు.