News June 25, 2024

ప్రకాశం: షాప్ ముందుకు నీళ్లు వచ్చాయని మర్డర్: ఎస్సై

image

చీరాలలో ఈనెల 23న పట్టపగలు జరిగిన హత్యలో నిందితులను మంగళవారం అదుపులోకి తీసుకున్నట్లు సీఐ శేషగిరిరావు తెలిపారు. పోలీసుల వివరాలు.. కర్రీస్‌ పాయింట్‌ నిర్వాహకుడు కే.సంతోష్‌ రోడ్డుపై బబుల్‌తో నీళ్లు దొర్లించాడు. పక్కనే ఉన్న పండ్లషాప్ ముందుకు వెళ్లడంతో అందులో పనిచేసే ఉమామహేశ్వరరావు వాగ్వావాదానికి దిగాడు. అది కాస్తా ఘర్షణకు దారితీసింది. షాపు యజమాని యోసేఫ్‌ ప్రోద్బలంతో కత్తితో దాడి చేసి పరార్ అయ్యాడు.

Similar News

News March 2, 2026

FLASH టంగుటూరు: రైలు ఢీకొని మహిళ మృతి

image

టంగుటూరు రైల్వే స్టేషన్ ఉత్తరం వైపు గుర్తు తెలియని 50 ఏళ్ల మహిళను కేరళ ఎక్స్‌ప్రెస్ ఢీకొంది. ఈ ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. మహిళ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని, వివరాలు తెలిస్తే 924757632 నంబర్‌ను సంప్రదించాలని ఒంగోల్ RPF ఎస్‌ఐ శ్రీరాం తెలిపారు.

News March 2, 2026

ప్రకాశం: కెనాల్‌లో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

image

నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండల పరిధిలోని కేసీ కెనాల్‌లో ఆదివారం ప్రమాదవశాత్తు పడి గల్లంతైన ఒంగోలు యువకుడు హేమంత్ (17) మృతదేహం లభ్యమైంది. పోలీస్, అగ్నిమాపక సిబ్బందితో పాటు డ్రోన్ టీం సాయంతో గాలింపు చేపట్టగా, సోమవారం ఈర్నపాడు దగ్గర శవం దొరికినట్లు ఎస్సై జగన్మోహన్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

News March 2, 2026

మార్కాపురంలో కొత్త కొలువులు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

image

మార్కాపురంలోని కొత్త వన్ స్టాప్ సెంటర్‌లో ఖాళీగా ఉన్న పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు జిల్లా శిశు అభివృద్ధి సాధికారత అధికారిణి పద్మావతి ఆదివారం తెలిపారు. అర్హత గల మహిళా అభ్యర్థులు మార్చి 11 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు జిల్లా వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులు తీసుకుని, సర్టిఫికెట్లు జతచేసి జిల్లా కార్యాలయంలో అందజేయాలని సూచించారు.